మోడీకి జగన్ అభినందనలు..!

నిజమే.. మీరు కరెక్ట్‌గానే చదివారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి జగన్ అభినందనలు తెలిపారు. మోడీ ఆ అభినందులు రిసీవ్ చేసుకుని .. జగన్ అభినందించినందుకు పొంగిపోయారో లేదో తెలియదు కానీ.. మోడీని జగన్ అభినందించిన విషయాన్ని .. ఆయన మీడియా గొప్పగా ప్రచారం చేసింది. ఇంతకూ జగన్‌కు మోడీని ఎందుకు అభినందించాల్సి వచ్చిందంటే… ఈ రోజు ప్రధానమంత్రి వ్యవసాయరంగానికి సంబంధించి రూ. లక్ష కోట్ల నిధిని ప్రారంభించారు. ఇదే జగన్‌ను అమితంగా ఆకర్షించింది. మనసులో దాచుకోకుండా… అభినందనలు పంపేశారు.

ప్రధాని ప్రారంభించిన రూ. లక్ష కోట్ల నిధి వల్ల రైతులు పండించిన పంటలకు విలువను జోడించడానికి .. ఉన్నత స్థాయి ఆదాయాలు పొందటానికి వీలు కల్పిస్తుందని జగన్ చెప్పుకొచ్చారు. సాధారణంగా ఎవరైనా… తన కంటే కింది స్థాయి వారికి ఏదైనా మంచి పనులు చేస్తే ప్రోత్సాహకానికి అభినందనలు చెబుతారు. స్ఫూర్తిగా ఉంటుందని.. పెద్దలు ఇలా అభినందనలు పంపుతూ ఉంటారు. సాధారణంగా.. తన కంటే పై స్థాయి వారికి కింది స్థాయి వారు… “శభాష్” అని చెప్పరు. చెబితే అతిశయోక్తి అవుతుంది. మంచి పని చేస్తే మహా అయితే కృతజ్ఞతలు చెబుతారు. రైతుల్ని ఆదుకున్న ధీరుడని పొగుడుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. అభినందనలు తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెబుతూ ఉంటారు. రైతులకు ఎవరూ చేయలేనంత సాయం చేశామని.. రైతు భరోసా కింద.. రూ. 7500 ఏడాదికి ఇస్తూంటారు. మిగతా రూ. 6వేలు కేంద్రం ఇస్తుంది. అంత మాత్రం దానికే తాము ఎంతో చేస్తూంటే.. ఇప్పుడు ప్రధాని మేలుకుని ఎంతో కొంత చేస్తున్నారన్న ఉద్దేశంతో.. అభినందనలు చెప్పినట్లుగా ఉందన్న చర్చ.. రాజకీయవర్గాల్లో నడుస్తోంది. అసలే సోషల్ మీడియా ఇలాంటి వాటిని ఎక్కువగా హైలెట్ చేస్తూ ఉంటుంది. వెటకారం చేశారని.. పై వాళ్లకు అనిపిస్తే.. జగన్‌కు ఇబ్బందులు ఎదురవతాయని.. జగన్ సోషల్ మీడియా టీం గుర్తించాల్సి ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close