ఉద్దానంకు ఊపిరి పోస్తున్న జగన్..!

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రపంచవ్యాప్తంగా వైద్య పరిశోధకులకు సవాల్‌గా మారిన ప్రాంతం. అక్కడి ప్రజలకు కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయో.. ఎంత రీసెర్చ్ చేసినా .. పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోయారు. ప్రభుత్వాలు ఇంత వరకూ ఎలాంటి గట్టి చర్యలు తీసుకోలేకపోయాయి. తొలి సారి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. రూ. 50 కోట్లతో ఓ రీసెర్చ్ సెంటర్ ప్లస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని నిర్ణయించింది. ఉద్దానం ప్రాంతంలోని పలాసలో 200 పడకలతో అది రూపుదిద్దుకోనుంది. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి ఆనుసంధానంగా రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తారు.

ఉద్దానం సమస్య దశాబ్దాలుగా ఉన్నప్పటికీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్… ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గత సర్కార్ పై ఒత్తిడి తీసుకు వచ్చారు. దాంతో గత సర్కార్ డయాలసిస్ పెషంట్లకు ఉచిత వైద్యం, గ్రామాలకు నీరు అలాగే.. పెన్షన్లు ఇచ్చే ఏర్పాట్లు చేసింది. పవన్ కల్యాణ్ ఆక్స్‌ఫర్డ్ వైద్యులతో పరిశోధన కూడా చేయిస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రూ. 50 కోట్లతో ఆస్పత్రినే నిర్మించాలని నిర్ణయించింది. సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, వజ్రపు కొత్తూరు, పలాస, మందస మండలాలను కలిపి ఉద్దానం ప్రాంతంగా పిలుస్తారు. ఏ గ్రామానికి వెళ్లినా, ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు కిడ్నీ వ్యాధులతో బాధపడుతూంటారు.

ప్రభుత్వ అంచనాల ప్రకారం గత రెండు దశాబ్దాలలో ఇప్పటివరకు 15,623 మంది ఇలా తీవ్రమైన కిడ్నీ జబ్బుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రభుత్వ గణాంకాల ప్రకారం 8,500 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఈ కిడ్నీ సమస్యను అధిగమించాలంటే బయట ప్రాంతాల నుంచి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవటం ఒకటే మార్గమని నిపుణలు అంచనా వేశారు. దీంతో… శాశ్వత మంచినటి పథకానికి కూడా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు తగ్గితే.. అది ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close