పథకాల అమలు పర్యవేక్షణకు జగన్..!

సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్.. అవి క్షేత్ర స్థాయిలో ఎలా అమలవుతున్నాయో పర్యవేక్షించేందుకు గ్రామాల బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. పారదర్శకత, అవినీతి, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలని.. మనకు ఓటేయకపోయినా అర్హత ఉన్నవారికి పథకాలు అందాలని జగన్ ఎప్పుడు సమావేశం జరిగినా అధికారులకు ఉద్భోధిస్తున్నారు. ప్రకటించిన సమయంలోగా సకాలంలో పథకాలు అందాలని.. ఎవరి దరఖాస్తులను కూడా తిరస్కరించకూడదని స్పష్టం చేస్తున్నారు. అర్హత ఉన్న వారికి పథకాలు అందకపోతే… అధికారులే బాధ్యులని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ వస్తున్నారు.

పెన్షన్, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీకార్డులు, రేషన్‌ కార్డులు… తప్పనిసరిగా అర్హులకు అందాలి, మొదట వీటిపై దృష్టి పెట్టాలన్నారు. ఆగస్టునుంచి గ్రామాల్లో పర్యటనకు సిద్ధమవుతున్నానని… పథకాలు అందలేదని ఎలాంటి ఫిర్యాదులు రావొద్దని సీఎం స్పష్టం చేశారు. పథకాల విషయంలో ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం నమ్ముతోంది. గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా… అర్హులందరికీ లబ్ది కలిగిస్తున్నామని.. ప్రజల్లో సానుకూలత ఉంటుందని అంచనా వేస్తోంది. అందుకే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.

ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందికానీ.. అర్హతల పేరిట… అరవై, డెబ్భై శాతం మందిని అనర్హుల్ని చేస్తోందన్న విమర్శలు విపక్షాల నుంచి ప్రజల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమస్యల ను ప్రభుత్వం అధిగమించాల్సి ఉంది. రెండు నెలలలో సీఎం గ్రామాల పర్యటన ప్రారంభించేనాటికి.., ఆ సమస్యలను అధికారులు పరిష్కరించాల్సి ఉంది. సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజా క్షేత్రంలోకి రాలేదు. ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. ఇక ముందు ఖచ్చితంగా పర్యటించాలని ఆయన అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close