వైఎస్‌ బతికుంటే కాంగ్రెస్‌పై ఉమ్మేసేవాళ్లట.. షర్మిల జోస్యం !

సొంత రాజకీయం కోసం కొత్త తరం అవతార నేతలు ఎంతకైనా దిగజారిపోతారని పదే పదే రుజువు చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ కుటుంబసభ్యులు ఈ విషయంలో ఒకరిని మించి ఒకరు … అంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు జగన్ వ్యవహారశైలి ఏపీలో అందరూ ఆశ్చర్యంగా చూస్తూండగానే .. తెలంగాణలో షర్మిల అదే విధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి బతికి ఉంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారని చెప్పుకొచ్చారు. సంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ కుటుంబం ఎదిగింది కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద. అప్పుల్లో ఉన్న కుటుంబం వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాల మీద. వైఎస్ఆర్ పార్టీ హైకమాండ్‌కు ఎంత విధేయంగా ఉండేవారో కథలు కథలుగా చెబుతారు. పార్టీ గురించి ఆయన ఎక్కువగా ఆలోచించేవారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమనేవారు. చనిపోయే వరకూ ఆయన కాంగ్రెస్ పార్టీనే. మరో ఆలోచన చేయలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పదవి ఇవ్వలేదని కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీపై పగబట్టింది. ఇప్పుడు ఏకంగా ఉమ్ముల గురించి మాట్లాడేస్తున్నారు.

మామూలుగా మూలాలు మర్చిపోతే పతనం ఖాయమని అంటూంటారు. కానీ రాజకీయ నేతలు మాత్రం తమ మూలాలు గుర్తుంచుకునే పతనమవుతూంటారని అనుకుంటారు. అందుకే ఎన్టీఆర్ భిక్షతో రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికీ పదవులు అనుభవిస్తున్నా.. ఆయనను తూలనాడతారు. ఏ పార్టీతో తాము ఈ స్థితిలో ఉన్నామో తెలిసి కూడా ఆ పార్టీపై ఖండ్రించి ఉమ్మేస్తామని సులువుగా మాట్లాడేస్తున్నారు. రాజకీయాల్లో విలువులు అనేవి ఉండవనడానికి ఇవన్నీ ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close