వైఎస్‌ను కుట్ర చేసి చంపారు..నన్నూ చంపాలనుకుంటున్నారు : షర్మిల

వైఎస్ కుటుంబం మొత్తం రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్నే కాదు ఆయన మరణాన్ని కూడా జనం నమ్మినంత కాలం ఉపయోగించుకునేందుకు ఏ మాత్రం సిగ్గుపడకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. గతంలో విజయమ్మ, జగన్, షర్మిల ఏపీ పర్యటనలో అలాంటి ఆరోపణలు చేసేవారు. వారు రిలయన్స్ పై ఆరోపణలు చేశారు. ఆ రిలయన్స్‌కే ఇప్పుడు జగన్ రాజ్యసభ సీటిచ్చారు. తన ఇంట్లో అంబానీకి విందు ఇచ్చారు. అందరూ ఔరా అనుకుంటున్న సమయంలోనే షర్మిల తెలంగాణ లో “వైఎస్ చావు పాట” ప్రారంభించారు.

తెలంగాణలో ఆమె పాదయాత్రను కనీసం పట్టించుకుంటున్న వారు లేరు. కేసీఆర్ ఉరేసుకుని చచ్చిపోవాలని అంటున్నా… ఇతర టీఆర్ఎస్ నేతల్ని దారుణంగా తిడుతున్నా పట్టించుకున్న వారులేరు. దీంతో ఆమె కొత్త పద్దతిలో మీడియా ముందుకు వచ్చారు. సంకెళ్లు తీసుకు వచ్చి మీడియా సమావేశంలో ప్రదర్శించి వైఎస్ఆర్ ను కుట్ర చేసి చంపారని వైఎస్ షర్మిల అన్నారు. తనను కూడా అలాగే కుట్ర చేసి చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్ మరణం వెనుక ఉన్న కుట్ర ఆ కుటుంబానికి వారికి ప్రజల్లో సానుభూతి అవసరం అయినప్పుడు.. అధికారం లేనప్పుడే గుర్తుకు వస్తోంది. ఇతర సందర్భాల్లో మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు.

తనను అరెస్ట్ చేయాలనుకుంటున్నారని ప్రెస్ మీట్‌లో సంకెళ్లు చూపిస్తూ ఆ సంకెళ్లు తనను ఏమీ చేయలేవని అన్నారు. తనకు బేడీలు అంటే భయం లేదని, చేతనైతే తనను అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాలు విసిరారు. తాను బతికి ఉన్నంత కాలం ప్రజల నుంచి తనను వేరు చేయడం ఎవరి తరమూ కాదని పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పారు. షర్మిల వ్యవహారశైలి చూస్తూంటే ప్రశాంత్ కిషోర్ ను కాపీకొట్టే స్ట్రాటజిస్ట్ ఎవరో షర్మిలకు పని చేస్తున్నారన్న అనుమానం తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close