పాదయాత్ర ఆపేయాలనే కుట్ర చేశారు..! జగన్‌కు పునర్జన్మ : విజయమ్మ

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై జరిగిన దాడి ఘటన..ఒక పునర్జన్మ అని… వైఎస్ విజయమ్మ అన్నారు. గొంతులో దిగాల్సిన కత్తి ఆయన చేతికి తగిలింది కాబట్టి ప్రాణపాయం నుంచి దేవుని దయవల్ల.. ప్రజలందరి ఆశీస్సుల వల్ల జగన్ తప్పించుకున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నామన్నారు. ఈ కేసు వ్యవహారం ఇంకా ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉందని విమర్శించారు. జగన్ పాదయాత్రను ఆపేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. గుంటూరు, గోదావరి జిల్లాలో జగన్‌ను అంతం చేయడానికి రెక్కీ నిర్వహించారని విజయమ్మ ఆరోపించారు. జనం మధ్య వైఎస్ జగన్‌ను ఏం చేయలేరని జనంలేని ఎయిర్‌పోర్టులో దాడిచేశారన్నారు.

ప్రతి పక్షాలకు సెక్యురిటి లేకపోతే ఇంకా అధికార ప్రభుత్వానికి ఎలా సెక్యురిటి ఉంటుందని విజయమ్మ ప్రశ్నించారు. డీజీపీపైనా విజయమ్మ విమర్శలు గుప్పించారు. డీజీపీ .మాట్లాడిన తిరు, చంద్రబాబు మాట్లాడిన తీరు బాగోలేదన్నారు. ధర్డ్ పార్టీ విచారణ చేయించడానికి చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. జగన్ ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని హైదరాబాద్ వస్తే.. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారని విమర్శించారు. దాడి తర్వాత కూడా తమ కుటుంబాన్ని తీవ్రంగా అవమానిస్తున్నారు. ఒక తల్లి మీద, చెల్లి మీద, ఒక భార్యపై కూడా మాట్లాడుతున్నార విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నీ భరిస్తున్నాం.. అన్నీ సహిస్తున్నాం. ఎన్ని కష్టాలెదురైనా ఎక్కడా తలదించేదిలేదన్నారు. రాజశేఖరరెడ్డిని ఒక నాయకుడిగా ప్రజలు గుర్తించి.. 30 ఏళ్లపాటు వారి భుజస్కందాలపై మోశారని… వైఎస్ కుటుంబాన్ని ఆదరించిన, ఎంతగానో ప్రేమించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామన్నారు. వైఎస్ మరణించిన తర్వాత తాను ఒంటరిని కాను.. తనకు ప్రజలంతా తోడున్నారని వైఎస్ జగన్ ఎప్పుడు చెబుతుంటారని విజయమ్మ గుర్తు చేసుకున్నారు. నా కుమారుడ్ని మీ చేతుల్లో పెడుతున్నా.. అని వైసీపీ మొదటి ప్లీనరి సమావేశంలోనే చెప్పానని విజయమ్మ గుర్తు చేశారు. జగన్ ఏడేళ్లలో.. ఎక్కువగా ప్రజల్లోనే గడిపారని.. కుటుంబంతో కూడా గడపలేదన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుపై విజయమ్మ విమర్శలు చేశారు. వ్యవస్థల్లో వారి మనుషులను పెట్టుకుని.. తొమ్మిదేళ్ల తర్వాత వైఎస్ భారతీని ఈడీ కేసులో ఇరికించాలని ఎన్నో ప్రయత్నాలు చేయడాన్ని చూస్తున్నామన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా జగన్‌ దేనికీ చలించలేదు.. దేనికి చెక్కుచెదరలేదన్నారు. నియంతృత్వ కాంగ్రెస్, వికృత టీడీపీతో కలిసి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాల పాటు.. కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తే.. ఇబ్బందులు పెడుతున్నారని కాంగ్రెస్ పై మండిపడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close