ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు సమర్థులు కారా !?

వైసీపీ ప్రభుత్వం రెడ్లకు సామాజిక న్యాయం చేయడానికి అందరికీ అన్యాయం చేస్తోంది. ప్రభుత్వం లో టాప్ ఫోర్‌ని చూస్తే తెలిసిపోతుంది. ఇక కింది స్థాయిలో ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. దానికి తాజా ఉదాహరణ.. ఏపీ పంచాయతీరాజ్ ఈఎన్‌సీ పోస్టు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక…ఆ పోస్టులో అర్హత లేని ఓ కడప రెడ్డిగారిని నియమించారు. నిజానికి ఆ పోస్టు సీనియార్టీలో ఆ రెడ్డి గారి కంటే ఎంతో ముందున్న బలహీనవర్గాలకు చెందిన అధికారులకు దక్కాలి. కానీ ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎక్కడ కక్ష సాధిస్తుందోనని వారు సైలెంట్ అయ్యారు.

ఆ కడప రెడ్డిగారు.. రిటైరైనా రెండు దఫాలుగా పొడిగింపు పొందారు. ఇప్పుడు రిటైరయ్యారు. ఆయన పోస్ట్ బాలునాయక్ అనే ఎస్టీ అధికారికి రావాలని కానీ.. ఆయన కంటే జూనియర్ అయిన సుబ్బారెడ్డి అనే రెడ్డి గారు ఉత్తర్వులు తెచ్చేసుకున్నారు. బాధ్యతలు చేపట్టారు. ఆ జీవోను ప్రభుత్వం రహస్యంగానే ఉంచింది. దీంతో బాలునాయక్ .. పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఆయన గిరిజన వర్గానికి చెంది ఉండవచ్చుకానీ.. అసమర్థుడు కాదని.. రెడ్లకే సమర్థత ఉంటుందా అన్న చర్చ పంచాయతీరాజ్ శాఖలో జరుగుతోంది.

ఒక్క పంచాయతీ రాజ్ శాఖ మాత్రమే కాదు.. వైసీపీ ప్రభుత్వంలో ప్రతీ శాఖలోనూ ఇదే తంతు. అర్హత.. అనుభవం లేకపోయినా.. ఓ సామాజికవర్గానికే పెద్ద పీట వేస్తున్నారు. సమర్థత ఉన్నా. .. ఎస్సీ, ఎస్టీ, బీ సీ వర్గాల అధికారులను పక్కన పెట్టేస్తున్నారు. ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వంతో కలిసిపోయి… ఇలాంటి వాటిని పట్టించుకోవడం మానేశారు . బలహీనవర్గాల ఉద్యోగులు … ఈ వేదనను గత మూడున్నరేళ్లుగా అనుభవిస్తూనే ఉన్నారు. ఓ పద్దతిలేని పాలనలో తాము అన్యాయమైపోతున్నామని ఆవేదన చెందుతూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close