జగన్ దీక్ష కోసం భూమిపూజ..అందుకేనా?

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 26 నుండి గుంటూరులో ఏసి కాలేజీ ఎదుట ఉన్న మైదానంలోఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. అందుకోసం ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ తదితరులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అది సర్వసాధారణమయిన విషయమే.
కానీ వారు దాని కోసం భూమి పూజ నిర్వహించడమే చాలా విచిత్రంగా ఉంది. సాధారణంగా ఏదయినా నిర్మాణ కార్యక్రమాలకి మాత్రమే ప్రజలు భూమి పూజలు చేస్తుంటారు. కానీ నాలుగయిదు రోజుల్లో ముగిసిపోబోయే ఆమరణ నిరాహార దీక్ష కోసం ఏర్పాట్లు మొదలు పెట్టేముందు భూమి పూజ చేయడం సరికొత్త ట్రెండ్ అనే చెప్పక తప్పదు. దానికి వైకాపా నేతలు శ్రీకారం చుట్టారు.

క్రీష్టియన్ మతస్తుడయిన జగన్ హిందూ స్వాములను కలవడం, పుష్కర స్నానాలు చేసి పిండ ప్రదానాలు చేయడం, ఇప్పుడు అవసరం లేకపోయినా భూమి పూజలు చేయడం వంటివన్నీ గమనిస్తే బహుశః ఆయన హిందువులకు దగ్గరయ్యేందుకే ఇటువంటి అనవసరమయిన హడావుడి చేస్తున్నరేమో? అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయ నాయకులు ఎన్నికల ముందు అన్ని మతాల ప్రజలను ఆకట్టుకొనేందుకు రకరకాల వేషాలు వేస్తూ హడావుడి చేస్తుంటారు. కానీ ఏ ఎన్నికలు లేని ఈ సమయంలో వైకాపా నేతలు ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో? ఏమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close