వైసీపీకి మరో షాక్: టీడీపీలో చేరిన బద్వేల్ ఎమ్మెల్యే

హైదరాబాద్: ఏపీలో టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితమే నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీను కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మరో షాక్ తగిలింది. కడప జిల్లా వైసీపీ నాయకుడు, బద్వేల్ ఎమ్మెల్యే త్రివేది జయరాములు ఇవాళ విజయవాడలో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఆయన చేతుల మీదుగా పచ్చ కండువా కప్పుకుని టీడీపీలో చేరారు. కృష్ణాజిల్లా ఎమ్మెల్యే బొండా ఉమ, అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కూడా అక్కడ ఉన్నారు. బద్వేల్ బాగా వెనకబడిందని, నియోజకవర్గ అభివృద్ధికోసమే తెలుగుదేశంలో చేరానని జయరాములు చెప్పారు. తనకు జగన్‌తో ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. మొన్న టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి తదితరులు మరికొంతమంది కూడా వస్తారని చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే ఇవాళ జయరాములు టీడీపీ తీర్థం పుచ్చుకోగా, మరో కొంతమంది క్యూలో ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు బద్వేల్ ఎమ్మెల్యే టీడీపీలో చేరిన సమయానికి జగన్ అక్కడ ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అవటం విశేషం. పార్టీలో మిగిలిఉన్న ఎమ్మెల్యేలకు ఆయన నిన్నే హేట్సాఫ్ చెప్పగా, ఇవాళ మళ్ళీ ఒకరు జంప్ కావటం ఆయనకు షాకేనని చెప్పాలి. జయరాములు గతంలో పులివెందుల మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీలో చేరి బద్వేల్ ఎస్‌సీ నియోజకవర్గంలో పోటీచేసి గెలిచారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close