షర్మిల పాదయాత్రను పట్టించుకునేవారేరీ !?

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తన ప్రజా ప్రస్థానం పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. గతంలో పాదయాత్రకు బ్రేక్ పడిన చోట నుంచే తిరిగి ఈ యాత్రను కొనసాగిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం కొండపాక గ్రామం నుంచి ఈ యాత్రను మొదలుపెట్టారు. అయితే ఆమె మళ్లీ పాదయాత్రను ప్రారంభించినట్లుగా ప్రచారం లభించలేదు. ఎవరూ పట్టించుకోవడం లేదని.. పలు టీవీచానళ్లకు ప్రకటనలు ఇచ్చినా ప్రయోజనం లేకపోయిది.

తెలంగాణలో షర్మిలకు మీడియా సపోర్టు కరవైంది. ఏబీఎన్ చానల్ గతంలో మంచికవరేజీ ఇచ్చేది. ఇప్పుడు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నట్లుగా మారిపోయింది. వైఎస్ఆర్‌టీపకి సోషల్ మీడియా కవరేజీ కూడా తక్కువ. ఖర్చు ఎక్కువ ఉందికానీ.., వస్తున్న ప్రచారం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఆమె పాదయాత్రలో పాల్గొంటున్న వారు కూడా.. స్థానికులు కాదని.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారన్న విమర్శలు ఉన్నాయి. అంతా ఫ్యాబ్రికేటెడ్‌గా జరుగుతూండటంతో మీడియా కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించిన చేవెళ్ల నుంచే షర్మిల సైతం 2021 అక్టోబర్ 20వ తేదీన పాదయాత్ర మొదలుపెట్టారు. 21 రోజుల పాటు పాదయాత్ర కొన‌సాగింది. మ‌ధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, కరోనా ఉధృతి దృష్ట్యా 2021 నవంబరు 9వ తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇప్పుడు ప్రారంభించేసరికి అసలు పట్టించుకునేవారు కరవయ్యారు. అదే సమయంలో ఆమె ఏపీ రాజకీయాల్లోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆమె భర్త అనిల్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు. ఇది మరింతగా మైనస్ అవుతోంది. తెలంగాణ ప్రజలు ఒక్క శాతం కూడా ఆమెను తెలంగాణ బిడ్డగా భావించకపోతూండటంతో పరిస్థితి పూర్తి మైనస్‌గా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆయన 20 మంది ఎమ్మెల్యేలతో వచ్చేత్తా అంటే కేసీఆరే వద్దన్నారట !

కాంగ్రెస్ ప్రభుత్వం తన దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉందని అంటున్నారు కేసీఆర్. ఎందుకంటే ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చే ఓ సీనియర్ నేత .. కేసీఆర్ తో టచ్...

కేంద్ర‌మంత్రిగా ఈట‌ల రాజేంద‌ర్… బీజేపీ అగ్రనేత జోస్యం!

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కేంద్ర‌మంత్రి కాబోతున్నారా...? మ‌ల్కాజ్ గిరి దీవించి పంపితే జ‌రిగేది అదే అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు కేంద్ర‌మంత్రి. మల్కాజ్ గిరిలో ఈట‌ల గెలిస్తే కేంద్ర‌మంత్రి అవుతారు అంటూ...

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

తొలి రోజు నామినేషన్లకు ఆసక్తి చూపని వైసీపీ నేతలు

ఏపీలో నామినేషన్ల సందడి తొలి రోజు అంతా పసుపు హడావుడి కనిపించింది. కూటమిలోని పలువురు కీలక నేతలు తొలి రోజు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close