కోర్టు తీర్పు వల్లనే  దసపల్లా భూములు ప్రైవేటుకు ఇచ్చేశారట !

అమరావతి విషయంలో హైకోర్టు చెప్పింది. కానీ పట్టించుకోవడం లేదు. కోర్టు ధిక్కరణ అవుతుందనే భయం లేదు. కోర్టునైనా ధిక్కరిస్తామంటున్నారు. ఇది ఒక్కటి కాదు. కొన్ని వందల కేసుల్లో కోర్టును ధిక్కరించారు. కోర్టు చేత చీవాట్లు తిన్నారు. సివిల్ సర్వీస్ అధికారుల్ని జైలుకు పంపినంత పని చేశారు. కానీ ఇప్పుడు మాత్రం విశాఖలోని దసపల్లా భూములను రాత్రికి రాత్రి ప్రైవేటుకు కట్టబెట్టేయడానికి కోర్టు ధిక్కరణ భయం అని చెబుతున్నారు విజయసాయిరెడ్డి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకే తాము ప్రైవేటు వ్యక్తులకు భూములు ఇచ్చేస్తున్నామని… అలా ఇచ్చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అంటున్నారు.

విశాఖలో దసపల్లా భూముల స్కాం మొత్తం విజయసాయిరెడ్డి కనుసన్నల్లో జరిగిందని రూ. వేల కోట్లు దోచుకునేందుకు రంగం సిద్ధం చేసుకన్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ భూములన్నీ ప్రభుత్వానివని.. అందుకే గత ప్రభుత్వం 22ఏలో చేర్చిందని..కానీ ఈ ప్రభుత్వం న్యాయపరంగా ఎలాంటి పోరాటం చేయకుండా… సుప్రీంకోర్టు తీర్పు పేరుతో ప్రైవేటుకు భూములు అప్పగించేస్తున్నారని అంటున్నారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అంటున్నారు. గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు టీడీపీ హయాంలో ఆ భూముల్లో లావాదేవీలు జరగకుండా 22ఏలో చేర్చి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. కానీ అప్పట్లో వైసీపీ నేతలు దసపల్లా భూములను టీడీపీ నేతలు కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆ లెక్కన ఇప్పుడు వారు కొట్టేస్తున్నారని అనుకోవాలి.

దసపల్లా భాముల విషయంలో వైసీపీ నేతల తీరు చూస్తూంటే… కోర్టు తీర్పులను కూడా తమకు అనుకూలమైన వాటిని అమలు చేసి.. వ్యతిరేకమైన వాటిని అమలు చేయం .. ఏం చేస్తారో చేసుకోండని అన్నట్లుగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఎన్నో కేసుల్లో కోర్టు తీర్పులను అమలు చేయకుండా ధిక్కారనికి పాల్పడుతూ..వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులు అయినా దసపల్లా భూములను సుప్రీంకోర్టు తీర్పు..కోర్టు ధిక్కరణ భయంతో అమలు చేస్తున్నామని చెప్పడం.. ప్రజల్ని మోసం చేయడమే. ప్రజా ఆస్తుల్ని అప్పనంగా కొట్టేయాలనుకోవడమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close