ఏపీలో వైసీపీతో బీజేపీ పొత్తు !?

వైసీపీ ఎన్డీఏలో చేరబోతోందని ఢిల్లీ బీజేపీ నుంచి కొన్ని లీకులు బయటకు వచ్చాయి. కొంత మంది నేతలు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల నాటికి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా వైసీపీ ఉంటుందని.. ఏపీలో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయంటున్నారు. తెలంగాణ ఎన్నికల కంటే ముందే పొత్తులు ఖరారు చేస్తే… అక్కడా లాభం జరుగుతుందని అందుకే ఈ దశగా ముందడుగు వేస్తున్నామని చెబుతున్నారు.

సీఎం జగన్ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. మూడో రోజు ఆయన చాలా రహస్య సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన బీజేపీ పెద్దలను కలిశారని ఎన్డీఏలోకి మళ్లీ టీడీపీని ఆహ్వానించవద్దని.. తమ పార్టీనే ఎన్డీఏలో చేరుతుందని బీజేపీ పెద్దలకు ఆయన హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ మిత్రపక్షాల కోసం వెదుక్కుంటోంది. ఎన్డీఏలో ఇప్పుడు సీట్లు సాధించే కెపాసిటీ ఉన్న మిత్రపక్షాలు ఏమీ లేవు. శివసేన, అకాలీదళ్, జేడీయూ లాంటి పార్టీలన్నీ దూరమయ్యాయి. శివసేన , జేడీయూ కలసి వచ్చే అవకాశం లేదు. వస్తే దక్షిణాది నుంచే మిత్రపక్షాలను కలుపుకోవాలి.

టీడీపీ ఎన్డీఏలో చేరడానికి రెడీగా ఉంది.అదే జరిగితే.. కేంద్రంలో ఆ పార్టీ కూడా భాగమైనట్లే. అప్పుడు వైసీపీని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టవచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లిక్కర్ స్కాం మీద ఈడీ దాడులు చేయిస్తే.. అగ్రనేతలంతా ఇబ్బంది పడతారు. ఇతర అంశాల్లోనూ అంతే. అందుకే వైసీపీ.. టీడీపీని ఎన్డీఏలో చేర్చుకోవద్దని.. తాము చేరతామని చెప్పినట్లుగా చెబుతున్నారు. కారణం ఏదైనా మోదీకి చంద్రబాబు అంటే ఇష్టం లేదు.. జగన్ పై అభిమానం ఉంది. అందుకే వైసీపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. ఇదే నిజమైతే.. ముందు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ : బాలకృష్ణ

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమ స్పందన తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పాలనలో ఎంతో అభివృద్ధి సాధించిన సినీ పరిశ్రమ, అలాగే లబ్దిపొందిన చాలా...

జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేది నిజం – మోదీ, షాలతో భేటీ డౌట్ !

లండన్ లో ఉండి చంద్రబాబును అరెస్టు చేయించి ఇండియాకు రాక ముందే ఢిల్లీ పర్యటన పేరుతో ప్రచారం చేసుకుని మోడీ , షాలతో భేటీ అవుతారని ప్రచారం చేయించుకున్న జగన్ రెడ్డి తాపత్రయం...

చంద్రబాబుకు డబ్బు ముట్టినట్లు ఆధారాలున్నాయా ?: ఏసీబీ కోర్టు జడ్జి

చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, అలాగే బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఉదయం చంద్రబాబు తరపు లాయర్ దూబే, మధ్యాహ్నం...

సుధీర్ బాబుకి ‘హంట్’ నేర్పిన గుణపాఠం

సుధీర్ బాబు 'హంట్' సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. కెరీర్ లో పలు ప్రయోగాలు చేసిన సుధీర్ బాబు.. హంట్ కూడా తనకు మరో ప్రయోగాత్మక చిత్రం అవుతుందని బలంగా నమ్మాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close