మే 26న జగన్ ప్రమాణ స్వీకారం..! ముహుర్తం ఫిక్స్ చేసిన వైసీపీ..!

ఏప్రిల్ పదకొండో తేదీన పోలింగ్ ముగిసినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమదే ప్రభుత్వమన్న నమ్మకంతో ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్… కంగ్రాట్స్ చెప్పి.. సీఎం జగన్మోహన్ రెడ్డి అనే నేమ్ ప్లేట్ కూడా తయారు చేయించి ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు.. వైసీపీ నేతలు మరింత ముందడుగు వేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మే ఇరవై ఆరో తేదీన ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లుగా ప్రకటించారు. హైదరాబాద్‌లోని వైసీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు… జూన్ ఎనిమిదో తేదీ వరకూ తానే ముఖ్యమంత్రినని చెప్పడాన్ని తప్పుపట్టారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కాయంగా కాబట్టి… ఫలితాలు వచ్చిన వెంటనే.. ఇరవై ఆరోతేదీన జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని.. అలాంటప్పుడు.. జూన్ ఎనిమిదో తేదీ వరకూ…చంద్రబాబు ఎలా సీఎంగా ఉంటారని ప్రశ్నించారు.

సజ్జల రామకృష్ణారెడ్డి.. జగన్ కోటరీలో అత్యంత ముఖ్యుడు కాబట్టి.. ఈ విషయంలో.. వైసీపీలో చర్చ జరిగిన తర్వాతే నిర్ణయం తీసుకుని ఉంటారని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై కూడా చర్చ జరిగిందని… బయట ప్రచారం జరుగుతోంది. దీనిపై.. వైసీపీ నేతలు ఎక్కడా బహిరంగంగా మాట్లాడటం లేదు. అయితే.. ఎన్నికల్లో పోటీ చేసిన కొంత మంది సీనియర్ నేతలు మాత్రం… తమకు కీలక శాఖ దక్కుతుందని అనుచరులతో చెప్పి సంబర పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి.. పోలింగ్ రోజు మీడియాతో మాట్లాడినప్పుడు… గెలుపు, ప్రమాణస్వీకారంపై పెద్దగా మాట్లాడలేదు.

గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన తర్వాత మీడియా ప్రతినిధులు ప్రమాణస్వీకారం ఎప్పుడు చేస్తారని ప్రశ్నించినప్పుడు.. అంతా దేవుడి దయ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాత్రం తేదీ కూడా ఫిక్స్ చేసుకున్నారు. మరో నెల రోజులు ఉంది కాబట్టి.. జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత కేబినెట్‌ను కూడా డిసైడ్ చేసుకుంటారన్న ప్రచారం వైసీపీలో జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close