చంద్రబాబు సమీక్షలు చేస్తే ఆ మరణాలు ఆగిపోయేవా..?: వైసీపీ

చంద్రబాబు సమీక్ష చేసి ఉంటే.. అకాల వర్షాలు, ఎండల వల్ల చనిపోయిన వారు బతికి ఉండేవారా..? . మరణాలు ఆగేవా..?… ఇదీ.. కేంద్ర ఎన్నికల సంఘానికి … టీడీపీ అధినేత రాసిన లేఖకు .. వైసీపీ నుంచి వచ్చిన కౌంటర్. ఏ మాత్రం.. మానవవత్వం లేకుండా… చనిపోయేవారు చనిపోతూనే ఉంటారు.. వారి కోసం ఏమీ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా.. ఉన్న ఈ స్పందన… చాలా మందికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. ఇలా కూడా ఆలోచిస్తారా..? ఇలా కూడా విమర్శలు చేస్తారా..? అని అనుకోవచ్చు. కానీ.. నిజంగా వైసీపీ నేతలు ఇలాగే ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, ఎండల కారణంగా.. వారం రోజుల్లో ఏడుగురు చనిపోయారని.. ప్రభుత్వ పరంగా.. సమీక్షలు చేసి..ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడానికి అధికారం లేదని.. సీఈవో చెప్పడం ఏమిటని…చంద్రబాబు.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారని.. ప్రశ్నించారు. దీనిపైనే వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాలన అంటే.. కనీస అవగాహన లేకుండా.. వైసీపీ నేతలు ఇలా వ్యాఖ్యానిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, కరువు, నీటి ఎద్దడి వంటి వాటికి తగిన చర్యలు తీసుకోడం.. ప్రభుత్వం ప్రాథమిక కర్తవ్యం. చంద్రబాబు తన లేఖలో అదే చెప్పారు. అయినప్పటికీ.. వైసీపీ నేతలకు అది నచ్చలేదు. ఏపీలో పరిస్థితుల్ని చూసి.. చంద్రబాబుకు ఎక్కడ ఎన్నికల నిబంధనల సడలింపు ఇస్తుందోనన్న ఆందోళనతో నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరణాలను ఎవరూ ఆపలేరు కానీ.. కనీసం మానవ ప్రయత్నం చేయడం మానవత్వం అన్న సంగతిని… వైసీపీ నేతలు గుర్తుంచుకుంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ వైసీపీ నేతలు… ఎప్పుడూ.. ఈ కోణంలో రాజకీయాలు చూడలేదు. వారిదంతా.. పదవీ రాజకీయాలేనని.. టీడీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close