స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్న ఏపీ సర్కార్..!

ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాలని జగన్ సర్కార్ పట్టుదలగా ఉంది. నిధుల అడ్డంకులు ఉన్నా.. కరోనా విజృంభిస్తున్నా… ప్రభుత్వం మాత్రం పనుల విషయంలో రాజీ పడటం లేదు. నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించి వివిధ సౌకర్యాల కల్పనకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఆ టెండర్లపై మళ్లీ రివర్స్ టెండర్లకు వెళ్లారు. ప్రభుత్వానికి రూ.143 కోట్లు ఆదా అయ్యాయి. మొదటి విడత నాడు-నేడు భాగంగా 15 వేలకుపైగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇందుకోసం రూ.710 కోట్లు రివాల్వింగ్ ఫండ్ కేటాయించారు. ఇప్పటివరకు రూ.504 కోట్లు పెట్టారు. ఆగస్టు 3న పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రధానంగా తొమ్మిది సౌకర్యాలను ప్రభుత్వ పాఠశాలకు నాడు-నేడు ద్వారా కల్పిస్తున్నారు. నీటి వసతి సహా మరుగుదొడ్లు, మేజర్‌, మైనర్‌ మరమ్మతులు, సురక్షిత మంచినీటి వసతి, విద్యార్థులు, ఉపాధ్యాయులకు సామగ్రి, ప్రతి తరగతి గదిలో గ్రీన్‌ చాక్‌బోర్డు, ప్రతి తరగతి గదిలో పంకా, ట్యూబ్‌లైట్‌, ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లిష్ ల్యాబ్‌, పాఠశాలలకు రంగులు., పాఠశాలకు ప్రహరీ నిర్మాణం చేపడుతున్నారు. దశలవారీగా 44వేల స్కూళ్లకు ఈ నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ స్కూళ్లు అంటే.. మౌలిక సదుపాయాలు ఉండవని అనుకుంటారు. కానీ ఆ పరిస్థితిని మార్చి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మార్చాలని.. ఏపీ సర్కార్ నిర్ణయించింది.

ఇప్పటికే ఇంగ్లిష్ మీడియంను.. అన్ని స్కూళ్లలో నిర్బంధం చేయాలన్న పట్టుదలతో ఏపీ ప్రభుత్వం ఉంది. న్యాయపరంగా కొన్ని చిక్కులు వస్తున్నా.. ఎలాగోలా అధిగమించి.. తెలుగు మీడియం లేకుండా చేయాలని… ఒక్క ఇంగ్లిష్‌లోనే బోధన చేయాలని పట్టుదలను ప్రదర్శిస్తోంది. దానికి తగ్గట్లుగా ఇప్పుడు స్కూళ్లకు మౌలిక వసతులు కల్పించే విషయంలోనూ.. రాజీ పడకుండా.. వ్యవహరిస్తోంది. దీంతో.. ప్రభుత్వ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close