ప్రణబ్‌ ట్విట్టర్‌ – వైసీపీ హ్యాపీ!

Telakapalli-Raviవైసీపీ అద్యక్షుడు జగన్మోహన రెడ్డి ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించిన సమస్యలపై తనను కలిశారని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఇది ఆ పార్టీ నాయకులకు చాలా సంతోష కారణమైంది. ఎందుకంటే జగన్‌ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా ఈడీ కేసుల గురించో మరో దాని గురించో మాట్లాడేందుకు వెళ్లారని ముందుగానే తీవ్ర ప్రచారం నడుస్తుంటుంది. ఆ అవకాశం లేకుండా రాష్ట్రపతి కార్యాలయమే ఫోటోతో సహా ఎందుకు కలిసింది ప్రకటించడం తమకు తలనొప్పి లేకుండా చేసిందని వారంటున్నారు. ప్రధాని మోడీ ప్రతిదీ ట్విట్టర్‌లో పెడుతుంటారు. ప్రణబ్‌ కూడా ఆ అలవాటు పెంచుకుంటున్నారేమో తెలియదు. కాని ఇలా చేయడం ఇదే మొదటి సారి అని వైసీపీ వర్గాలు మరింత ఆనందపడుతున్నట్టు ఈ రోజు రాత్రి నేను సాక్షి చర్చకు వెళ్లినప్పుడు అర్థమైంది. ఇక ఫిరాయింపులకు సంబంధించినంత వరకూ ఇంకా కొంత మంది గోడ దూకవచ్చుననే అంచనా వారిలో వుంది గాని పార్టీ తలకిందులై పోతుందని భావించడం లేదు. శాసనసభలో రోజాపై చర్చను స్పీకర్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును పక్కదోవ పట్టించడానికే ఈ సమయాన్ని ఎంచుకున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు. నేరుగా జనం మధ్యకు వెళ్లే జగన్‌ను ఇలాటివి ఏమీ చేయలేవని వారి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో తమ వారిని టిఆర్‌ఎస్‌ చేర్చుకున్న సందర్భంలో చంద్రబాబు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఎపిలో ఎదురు కొడతాయన్నది వారి ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది. కాని జగన్‌ వైఖరిలోనూ మార్పు అవసరమేనన్న మెళకువ మాత్రం వైసీపీ సలహాదారుల్లో పెద్దగా కనిపించకపోవడం విశేషం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close