ప్రభుత్వ నిర్ణయాలపై సమాచారం కావాలట..! వైసీపీ నేతల వింత పోకడ..!?

అధికారంలోకి అప్పుడే వచ్చేశామని ధీమా వ్యక్తం చేస్తోన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేతల అత్యుత్సాహం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయింది. కొంతమంది నేతలు నేరుగా అధికారులకు ఫోన్ చేసి రాబోతుంది మేమే.. చెప్పింది చేయ్యండంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారని.. ఏపీ సెక్రటేరియట్‌లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పోలింగ్ రోజు ఘర్షణలకు పాల్పడిన వైసీపీ నేతలపై … వరుసగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి.. క్యాడర్ పై కేసులు పెట్టకుండా ఉండేందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. పోలీస్ అధికారులకు, జిల్లాస్థాయిలో ఉన్న ఎస్పీలకు ఫోన్ చేసి ఇటీవల జరిగిన గొడవలు, అందులో వైసీపీ నేతలను అరెస్ట్ చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాబోతుంది తామేనని సాక్షాత్తు కొంతమంది జిల్లా ఎస్పీలకు ఫోన్ చేసి బెదిరించినట్టు ప్రచారం జరుగుతోంది.

సెక్రటేరియట్ లోని కొంతమంది అధికారులకు ఫోన్ చేసి తమకు తెలియకుండా జీవోలు ఎలా ఇస్తారని ప్రశ్నించటంతోపాటు ఆపధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు చెపితే ఫైళ్లు తీసుకెళ్తారా అంటూ నిలదీయటం ప్రారంభించారు. ఈ వింత పోకడతో అధికారులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. రోటీన్ గా పంపే ఫైళ్లను కూడా పెండింగ్ లో ఉంచటం, మరికొన్ని శాఖల్లో కొర్రీలేసి కిందకు పంపించడం లాంటివి చేస్తున్నారు. కొంతమంది అధికారులు తమకు తెలిసిన వారి ద్వారా లోటస్ పాండ్ లోని, జగన్ కోటరీలో ఉన్న కీలక వ్యక్తులతో పరిచయం పెంచుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కొంతమంది ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు కూడా వైసీపీ నేతల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. రాబోయేది తమ ప్రభుత్వమేనని, అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఎవరెమిటో, ఏ అధికారి ఎలా ఉన్నారో ఇప్పటికే జగన్ వద్ద చిట్టా ఉందని కూడా వారు నేతలకు హెచ్చరికలతో కూడిన సూచనలు చేశారని చెప్పుకుంటున్నారు.

వైసీపీ నేతలు మరింత ముందుకు వెళ్లి కేబినెట్ ఊహాగానాల్లో కూడా ఉన్నారని లోటస్‌పాండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరెవరికి మంత్రి పదువులు వస్తాయనే అంశంపై వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేసిన వారు చర్చించుకుంటున్నారు. ఎవరి గెలిస్తే ఎవరికి మంత్రి పదవి వస్తుందో..?, ఆయా జిల్లాల్లో కులాల వారీగా ఇక్వెషన్లు గురించి కూడా చర్చించుకుంటున్నారు. కౌంటింగ్ కంటే ముందే… జగన్ ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధపడినా ఆశ్చర్యం లేదన్నట్లుగా పరిస్థితి ఉందన్న అభిప్రాయం..టీడీపీలో వ్యక్తమవుతోందంటే… వైసీపీ నేతల ఆత్రుతే కారణం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close