చాంద్‌ జంపింగ్‌ : మైక్‌ కట్‌చేసినప్పుడే అర్థమైంది!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనుంచి తాజాగా మరో వికెట్‌ పడిపోతున్నది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఎమ్మెల్యే చాంద్‌ బాషా, నియోజకవర్గంలోని తన అనుచరులతో కలిసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఎన్ని పాట్లు పడుతూ ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్న సమయంలోనే ఇలా.. మరో జంపింగ్‌ చోటు చేసుకోవడం విశేషం.

అయితే చాంద్‌బాషా జంపింగ్‌ వెనుక ఆసక్తికరమైన కోణాలు కూడా ఉన్నాయి. శాసనసభ సమావేశాల సమయంలోనే చాంద్‌భాషా పార్టీ మారవచ్చుననే సంకేతాలు అందాయి. నిజానికి అది చాలా ఆసక్తికరమైన సంఘటన. చాంద్‌ బాషా ఏపీ అసెంబ్లీకి ఉన్న ప్యానెల్‌ స్పీకర్లలో ఒకరు. బడ్జెట్‌ సెషన్‌ సమయంలో ఒకరోజు ఆయన ఛెయిర్‌ చేయాల్సి వచ్చింది. ఆ సందర్భంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతున్నారు. వైఎస్‌ జగన్‌ తనకిచ్చిన సమయం కంటె చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. స్పీకర్‌ హోదాలో ఉన్న చాంద్‌ బాషా, తమ సొంత పార్టీ అధినేత జగన్‌ను పలుమార్లు హెచ్చరించారు. జగన్‌ గారూ మీరు ఆపాలి.. అంటూ చెబుతూ వచ్చారు. అయినా సరే.. స్పీకరు కుర్చీలో ఉన్నది తమ పార్టీ వాడే కదా అనే ఉద్దేశంతో జగన్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. అంతలో స్పీకరుగా చాంద్‌బాషా కఠిన నిర్ణయం తీసుకుని, జగన్‌ మైకు కత్తిరించేశారు. అసలే స్వామిభక్తి, విధేయత విపరీతంగా ఉండే వైకాపా ఎమ్మెల్యే తమ పార్టీ అధినేత మైకు కత్తిరించేయడం అనేది ఆరోజు తీవ్రమైన చర్చ అయింది.

చాంద్‌బాషా కూడా జంపింగ్‌ బాటలో ఉన్నాడేమోనని, అందుకే జగన్‌ను ఖాతరు చేయలేదని ఆరోజున బాగా పుకార్లు వచ్చాయి. దానికి తగ్గట్లుగా ఆ వెంటనే ఆయన నియోజకవర్గానికి వెళ్లినప్పుడు ఆయన కారు మీద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి అద్దాలు పగులగొట్టారు. అది కూడా వైకాపా వారే, జగన్‌ అభిమానులే చేసినట్లుగా ప్రచారం జరిగింది. మొత్తానికి కొన్ని వారాల గ్యాప్‌ తర్వాత చాంద్‌బాషా ఓ నిర్ణయానికి వచ్చినట్లుంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార తెలుగుదేశం పార్టీలో శుక్రవారం ఆయన చేరబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close