టీడీపీ ఎంపీల రాజీనామాల కోసమే వైసీపీ బంద్..! జగన్‌కు వచ్చే లాభమేంటి..?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. తెలిసి చేస్తున్నారో..తెలియక చేస్తున్నారో కానీ… ఎదురు తన్నే రాజకీయ నిర్ణయాలనే తీసుకుంటున్నారు. తనకు కానీ.. పార్టీకి కానీ మంచి జరిగే నిర్ణయం ఒక్కటీ కూడా తీసుకోవడం లేదు. పార్లమెంట్‌కు ఎంపీలతో రాజీనామాలు చేయడం.. ఓ పెద్ద సెల్ఫ్ గోల్‌గా మారిపోయింది. ఓ వైపు టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తూంటే.. వైసీపీ మాజీ ఎంపీలు నిస్సహాయంగా.. పార్లమెంట్ బయట గాంధీ విగ్రహం వద్ద నిలబడాల్సి వచ్చింది. రాజీనామాలు చేసిన తర్వాతైనా ఉద్యమం చేయించారా అంటే.. అదీ లేదు. రాజీనామాల నిర్ణయం ఇంతగా ఎదురు తన్నిన తర్వాత.. ఇప్పుడు మరో రాజకీయ ఎత్తుగడ వేశారు. అదే టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించడం.

నేను ఎంపీలతో రాజీనామాలు చేయించి.. చాలా నష్టపోయాను కాబట్టి.. ఎలాగైనా.. టీడీపీ ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించి..సమానం చేయాలనుకుంటున్నట్లున్నారు జగన్. మంగళవారం వైసీపీ బంద్… ప్రత్యేకహోదా కోసం కాదు. కేవలం తెలుగుదేశం పార్టీ ఎంపీలను రాజీనామాలు చేయాలనే ఒత్తిడి పెంచడానికేనట. ఆ పార్టీ నేతలు వరుసగా మీడియా ముందుకు వచ్చి… చేసిన చెలెంజ్‌లన్నీ…ఇలాగే ఉన్నాయి. ” రాజీనామా చేసే దమ్ముందా..?” .. ధమ్సప్ యాడ్ ప్రకటనల్లాగా చేసుకుంటూ వెళ్లారు. దానికి సాక్షి మీడియా కవరేజీ కూడా బాగానే ఇచ్చుకుంది. అయినా రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు ఏం చేయగలిగారో అందరూ చూశారు.. మళ్లీ ఇప్పుడు టీడీపీ ఎంపీలను కూడా జగన్ ఎందుకు రాజీనామా చేయమంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.

అయినా ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తున్నానంటే.. మైలేజీ వస్తుంది కానీ.. టీడీపీ ఎంపీల రాజీనామాల కోసం బంద్ చేస్తున్నామంటే.. ప్రజలు కూడా నవ్వుకోకుండా ఉంటారా..?. అసెంబ్లీకి వెళ్లరు.. పార్లమెంట్‌కు వెళ్లరు.. పార్లమెంట్‌కు వెళ్లి పోరాటం చేస్తున్న వారిని కూడా రాజీనామాలు చేయించి.. ఇంట్లో కూర్చోవాలని జగన్ డిమాండ్ చేయడం.. చాలా మంది సొంత పార్టీ నేతల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది. పార్లమెంట్‌లో తమకు అడ్డం లేకుండా.. టీడీపీ ఎంపీలతో .. రాజీనామా మైండ్ గేమ్ ఆడాలని.. బీజేపీ టాస్క్ ఇచ్చిందేమో అన్న సందేహం చాలా మందిలో ప్రారంభమయింది. ఈ వ్యూహం వెనుక అసలు కోణం జగన్‌కే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close