ఢిల్లీకి వైసీపీ ఎంపీలు.. హైకోర్టుకు ఆర్ఆర్ఆర్..!

వైసీపీ ఎంపీలందరూ..స్పీకర్ ఓం బిర్లాను కలిసేందుకు వెళ్ళిన సమయంలో… వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు…హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలను అడ్డుకోవాలని పిటిషన్ వేశారు. తనకు వేరే పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసులు ఇచ్చారని .. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యానని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసు ఇచ్చారన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తాను ఎక్కడా పాల్పడలేదని.. అయినా తనపై అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్తున్నారని రఘురామకృష్ణంరాజు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

జూన్ 29న ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన పిటిషన్‌పై.. ఇంకా సమాధానం రావాల్సి ఉందని ఎంపీ పిటిషన్‌లో పేర్కొన్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం తనపై చర్య తీసుకోవాలంటే.. క్రమశిక్షణా కమిటీ సమావేశం కావాలన్న నిబంధన పాటించలేదన్నారు. అయితే.. కరోనా కారణంగా.. అత్యవసర పిటిషన్లను మాత్రమే హైకోర్టు విచారిస్తోంది. ఈ కారణంగా ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

అయితే.. రఘురామకృష్ణంరాజు.. చర్య తీసుబోతున్నారంటూ.. హైకోర్టుకు వెళ్లడం.. వైసీపీ వాళ్లను కూడా ఆశ్చర్య పరుస్తోంది. లోక్‌సభ స్పీకర్ నిర్ణయం అంతిమం. వైసీపీ అయినా.. రఘురామకృష్ణంరాజు అయినా… స్పీకర్ ఓం బిర్లా ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాల్సిందే. న్యాస్థానాలు కూడా… జోక్యం చేసుకునే అవకాశం లేదు. అయితే రఘు రామకృష్ణంరాజు ఏ వ్యూహంతో… హైకోర్టులో పిటిషన్ వేశారనేది.. వైసీపీ నేతలకు కూడా అంతు చిక్కని అంశంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close