ఏపీ స్పెషల్ : అధికార పార్టీగా అయినా వైసీపీ ఆందోళనలు..!

ఎక్కడైనా విపక్షాలు … అధికార పార్టీ నేతల ఇళ్లను ముట్టడించి.. తమ డిమాండ్లను పరిష్కరించాలనే డిమాండ్లు చేస్తూంటాయి. కానీ విచిత్రంగా.. ఏపీలో అధికార పార్టీ విపక్షాల ఇళ్లను ముట్టడిస్తోంది. విపక్షాల శిబిరాల మీద దాడి చేస్తోంది. కాగడాలు పట్టుకుని వచ్చి తగులబెట్టేస్తామని హెచ్చరికలు చేస్తోంది. మొన్నటికి మొన్న తెనాలిలో అమరావతి జేఏసీ ఏర్పాటు చేసిన శిబిరంపై వైసీపీ నేతలు దాడులు చేసి నిప్పు పెట్టారు. ఆ వ్యవహారం ఇంకా చర్చల్లో ఉండగానే.. టీడీపీ నేతల ఇళ్లపైకి.. వైసీపీ కార్యకర్తలు దాడులు చేయడం ప్రారంభించారు. విశాఖలో గత వారం ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావు ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం సంచనలం సృష్టించింది. పులివెందుల ఫ్యాక్షన్ సంస్కృతి వైజాగ్ కు తీసుకొచ్చారని టీడీపీ నేతలు మండిపడ్డారు.

ఇప్పుడు.. వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇంటిపైకి కాగడాలతో వెళ్లారు. పెద్ద ఎత్తున ఓ ప్రణాళిక ప్రకారం.. కార్యకర్తల్ని కూడదీసుకుని వెళ్లడం కలకలం రేపుతోంది. పోలీసులు కూడా వైసీపీ నేతల ఆందోళనలను చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు . విశాఖ గుంటూరులోనే కాదు.. అనంతపురం జిల్లా హిందూపురంలోనూ వైసీపీ నేతలు… బాలకృష్ణను అడ్డుకున్నారు. ఓ ప్రణాళిక ప్రకారం.. టీడీపీ నేతలను అడ్డుకునే కార్యక్రమాలను.. చేస్తున్నారని.. అధికార పార్టీగా ఉండి.. ఇదేం పద్దతన్న విమర్శలు టీడీపీ నుంచి వస్తున్నాయి. అధికార పార్టీగా ఉండి.. లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన పార్టీనే… ప్రతిపక్ష పార్టీ నేతల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించి.. అలజడి రేపే ప్రత్నం చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

అమరావతి రాజధాని కోసం పోరాడుతున్న వారే.. వైసీపీ నేతల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించకుండా.. తమ నిరసనలు తాము చేసుకుంటున్నారు. అసలు సంబంధమే లేని.. హిందూపురం లో వైసీపీ కార్యకర్తలు.. బాలకృష్ణను అడ్డుకోవడం దేనికోసమో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఓ ప్రణాళిక ప్రకారం.. ఏపిలో ఉద్దేశ పూర్వక అలజడి రేపితే.. మిగిలిన విషయాలన్నీ డైవర్ట్ అయిపోతాయన్న వ్యూహం… అధికార పార్టీ అమలు చేస్తోందన్న అభిప్రాయం అంతటా వ్యక్తం చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close