ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై వైసీపీ స్పందన.. “నో కామెంట్”..!

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు.. ఆ రాష్ట్ర అంతర్గత వ్యవహారం.. మాకేమిటి సంబంధం..?. ఇదీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయసాయిరెడ్డి స్పందన. ఇంటర్ పరీక్షల వ్యవహారాలన్ని అక్కడి ప్రభుత్వం ఆ విషయం చూసుకుంటుందని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇంటర్ బోర్డు, పరీక్షలు, ఆత్మహత్యలు.. అన్నీ తెలంగాణవే.. అయితే.. ఓ రాజకీయ పార్టీకి చెందిన కీలక నేతగా.. అన అభిప్రాయాన్ని చెప్పడానికి ఆయన ఎందుకు అంత సందేహిస్తున్నారన్నదే కీలకం. విజయసాయిరెడ్డి స్పందన.. రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం కలగిస్తోంది.

మాట కంటే ముందు.. తెలంగాణ ప్రభుత్వానికి… సూపర్ అంటూ సర్టిఫికెట్ ఇవ్వడానికి … ఏ మాత్రం వెనుకాడని విజయసాయిరెడ్డి.. ఇంటర్ ఫెయిల్యూర్ విషయంలో మాత్రం తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరించి.. తప్పించుకోవావాలనుకున్నారు. ఇప్పటికే.. అన్ని రాజకీయ పార్టీలు.. ఇంటర్ బోర్డు వ్యవహారం, పిల్లల ఆత్మహత్యలపై.. స్పందించాయి. కానీ తెలంగాణ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న వైసీపీ నేతలు మాత్రం.. అచ్చం టీఆర్ఎస్ నేతల్లాగే మౌనం పాటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పాలనను ప్రతీ రోజూ విమర్శిస్తూ.. తెలంగాణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పాలన సాగుతోందని… నమ్మే ముఖ్యనేతల్లో విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటారు. అందుకే.. వారు ఏపీలోని ఏ వ్యవస్థను నమ్మరు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది.. కాబట్టి.. అక్కడ పోలీసు వ్యవస్థ దగ్గర్నుంచి ప్రజల వరకూ అందరూ.. టీడీపీ సానుభూతిపరులేనని అనుకుంటూ ఉంటారు. అందుకే ఏమైనా ఫిర్యాదులు ఉంటే.. నేరుగా.. తెలంగాణ పోలీసులకే చేసుకుంటారు తప్పా.. ఏపీ వరకూ రారు. అంతగా… తెలంగాణతో మమేకమైపోయిన… విజయసాయిరెడ్డికి.. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం… పట్టరానివిగా మారాయి. కనీసం…. ఇంటర్ విద్యార్థులకు సంఘిభావం తెలియజేయడానికి కూడా ఆయన సిద్ధపడలేదు. ఓ రాజకీయ పార్టీగా అయినా స్పందించలేని పరిస్థితుల్లో వైసీపీ ఉండిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close