ఎన్డీఏకు వైసీపీనే కాదు టీడీపీ కూడా సపోర్టే..!

భారతీయ జనతా పార్టీ మెప్పు కోసం వైసీపీతో పాటు టీడీపీ కూడా పోటీ పడి ఉత్సాహం ప్రదర్శిస్తోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకే మద్దతుగా నిలిచింది. ఎన్డీఏ తరపున జేడీ యూకు చెందిన హరి వంశ్ నారాయణ అభ్యర్థిగా నిలబడ్డారు. జేడీయూ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ జగన్‌కు ఫోన్ చేసి.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు. పార్టీ ఎంపీలతో చర్చించిన జగన్.. ఈ మేరకు ఎన్డీఏకు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ఒకే ఒక్క ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నారు. ఆయన కూజా ఎన్డీఏకే మద్దతు తెలిపారు.

రాజ్యసభలో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ లేదు. దీంతో వైసీపీకి ఉన్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల ఓట్లు కీలకం అయ్యాయి. అదే సమయలో టీఆర్ఎస్ ఎంపీల ఓట్లు కూడా కీలకమే. అయితే.. బీజేపీతో తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్న టీఆర్ఎస్ జేడీయూ అధినేత నితీష్ కుమార్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. మద్దతివ్వాలని అనుకోలేదు. దాంతో ఓటింగ్‌లో పాల్గొనకుండా గైర్హాజరయ్యారు.

ఎన్డీఏ అభ్యర్థి గెలుపు సునాయాసం అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలోని యూపీఏ పార్టీలతోపాటు..బీజేపీని వ్యతిరేకించే కొన్ని పార్టీలు కూడా కలిపితే ఆర్‌జేడీ ఎంపీ మనోజ్‌ ఝాను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల బరిలో నిలిపాయి. రాజ్యసభలో యూపీఏ కూటమి బలం 91మంది మాత్రమే. చివరికి బలం తేలిపోవడంతో.. ప్రత్యక్షంగా ఓటింగ్ నిర్వహించ లేదు .. వాయిస్ ఓటు ద్వారా.. ఎన్డీఏ అభ్యర్థి గెలిచినట్లుగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close