ఇక సోనూసూద్ వైసీపీ టార్గెట్…!

కొన్నాళ్ల క్రితం చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతు తన ఇద్దరు పిల్లలను కాడెడ్లుగా మార్చుకుని వ్యవసాయం చేస్తూంటే… జాలి పడిన సోనుసూద్ ట్రాక్టర్ పంపించారు. ఆ విషయం అప్పుడు సంచలనాత్మకం అయింది. సోను సూద్ దాతృత్వాన్ని అందరూ అభినందించారు. కారణం ఏమిటో తెలియదు కానీ.. ఒక్క వైసీపీ మాత్రం… ఆయన రైతు కాదని… మరొకటని.. ారు అలా కాడెడ్లతో వ్యవసాయం చేయడం లేదని నమ్మించడానికి చాలా ప్రయత్నం చేశారు. రైతుపై ఆరోపణలు చేశారు. అప్పుడే వైసీపీకి టార్గెట్ అయిన సోనుసూద్.. ఇప్పుడు.. మరోసారి వైసీపీకి టార్గెట్ అవుతున్నారు. చంద్రబాబుతో కలిసి కరోనా పరిస్థితుల్లో… సమాజ సేవ అంశంపై… వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని.. తన ఆలోచనలు పంచుకోవడంతో పాటు.. చంద్రబాబును పొగడటమే దీనికి కారణం.

సోనుసూద్ తో కలిసి పని చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకొచ్చారు. సోనుసూద్ చేస్తున్న సేవ గొప్పదన్నారు. చంద్రబాబు పొగిడినందున.. సోనుసూద్ కూడా చంద్రబాబు గురించి రెండు మంచి మాటలు చెప్పారు. ఆ మంచి మాటలను టీడీపీ సోషల్ మీడియా విభాగం విపరీతంగా వైరల్ చేసింది. ఇది వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఎలా నచ్చుతుంది. వెంటనే సోనుసూద్‌పై రివర్స్ ఎటాక్ ప్రారంభించారు. ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభించారు. చివరికి…ఆయనకు ఓ సామాజికవర్గం ముద్ర కూడా తగిలించేశారు.

మొదటి నుంచి సోనుసూద్‌పై ప్రశంసలే కాదు.. ఆయనకు వస్తున్న పేరును బట్టి రాజకీయ విమర్శలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. మొదట్లో శివసేన ఆయనను టార్గెట్ చేసింది. ఆయనకు డబ్బులెక్కడి నుండి వస్తున్నాయని ప్రశ్నించింది. కొంచెం ఘాటువిమర్శలే చేసింది. ఆయనను బీజేపీతో ముడి పెట్టింది. చివరికిఆయన ముఖ్యమంత్రి ఉద్దవ్ ధాకరేని కలిసి.. తన సేవలో రాజకీయ ఉద్దేశం లేదని వివరణ ఇచ్చుకున్న తర్వాత .. శివసేన సైలెంటయింది. ఆ తర్వాత పెద్దగారాజ కీయ పార్టీలు విమర్శలు చేయడం లేదు. ఇప్పుడు… మళ్లీ వైసీపీ .. ఆ విమర్శలు ప్రారంభించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో సోనుసూద్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. అధికారులు అడిగినా.. సాయం చేస్తున్నారు. ఆక్సిజన్ ప్లాంట్లు వంటివి ఏర్పాటు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close