ఇంకా పొత్తే లేదు కానీ వణికిపోతున్న వైసీపీ !

పవన్‌కు దమ్ము లేదు..అందుకే పొత్తులు పెట్టుకున్నారని ఒకరంటారు.. ఒక్క జగన్‌పై అందరూ కలిసి వస్తున్నారని మరొకరు అంటారు.. 175 స్థానాల్లో పోటీ చేస్తే ప్యాకేజీ స్టార్ అనం అని ఒకరు ఆఫర్ ఇస్తారు. ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటే ఓకే కానీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం మాత్రం తప్పేనని వైఎస్ఆర్సీపీ నేతలు వాదించడం ప్రారంభించారు.వైసీపీ నేతల ఈ కంగారు ప్రకటనలు చూసి.. వైసీపీ క్యాడర్ కూడా ఏం జరుగుతోందని విశ్లేషించుకునే పరిస్థితి వచ్చింది. జనసేన పార్టీ ఎలా పోతే మనకెందుకు.. ఎందుకంత కంగారుపడుతున్నామనేది ఎక్కువ మంది భావన. ఆ కంగారేంటో.. .మాట్లాడుతున్న వారికి తెలుసు.. కింది స్థాయి వారికి తెలియకపోవచ్చు.

వైసీపీ గెలుపు.. ఓటమికి తేడా జనసేన పార్టీనే. జనసేన మద్దతుతో టీడీపీ 2014లో పోటీ చేసినప్పుడు టీడీపీ విజయం సాధించింది. 2019లో జనసేన విడిగా పోటీ చేసింది. వైఎస్ఆర్‌సీపీ గెలిచింది. ఇప్పుడు మళ్లీ టీడీపీకి దగ్గరవుతోంది. రెండు పార్టీలు కలిస్తే విజయం ఏకపక్షమన్న విశ్లేషణలు కొన్ని వర్గాల నుంచి వచ్చాయి. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలో ఫలితాలు జనసేన చీల్చిన ఓట్లతో మారిపోయాయి. అదే సమయలో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఆ పార్టీ ఎలాగూ గెలవదన్న కారణంగా ప్రత్యామ్నాయంగా ఓట్లు వేసిన ఓటర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇది రివర్స్ అవుతుంది.

అధికారంలో ఉన్న పార్టీకి.. తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలిపోతే లాభం. ఈ రాజకీయం వైసీపీకి తెలుసు కాబట్టి.. విపక్షాల్ని ఏకం కానీయకుండా చూసుకుంటాయి అధికార పార్టీలు. కానీ ఏపీలో ఆ వ్యూహం ఫలించడం లేదు. జనసేన అధనేత తమ బలాన్ని..బలగాన్ని అంచనా వేసుకుని ఒంటరిగా పోటీ చేయాలా.. పొత్తులు పెట్టుకోవాలో డిసైడ్ చేసుకుంటారు. అది ఆయన ఇష్టం. వైఎస్ఆర్‌సీపికి సంబంధం లేదు. ఆ పార్టీకి మేలు చేసేలా పవన్ నిర్ణయాలు తీసుకోరు. జనసేనకు .. రాష్ట్రానికి ఏది మంచిదైతే ఆ నిర్ణయం తీసుకుంటారు !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close