బీహార్ ఎన్నికలలో ఎన్డీయే కూటమికే ఆధిక్యత: జీ న్యూస్ సర్వే

ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్షగా మారబోతున్నాయి. అధికారంలో ఉన్న జేడీయు, ప్రతిపక్షంలో ఉన్న ఆర్.జె.డి.తో సహా మరో నాలుగు పార్టీలు కలిసి జనతా పరివార్ కూటమిని ఏర్పాటు చేసుకొన్నాయి. వాటితో కాంగ్రెస్ పార్టీ కూడా జత కట్టింది. ఇంతవరకు విడివిడిగా పోటీ చేస్తున్న వామ పక్షాలు కూడా కూటమిగా ఏర్పడ్డాయి. ఈసారి ములాయం సింగ్ కి చెందిన సమాజ్ వాదీ పార్టీ, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లీస్ పార్టీ ఎన్నికల బరిలో ఉన్నాయి. వీటన్నిటినీ బీజేపీ ఒంటరిగా ఎదుర్కోబోతోంది.

ఇదివరకు ఈ పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేసినప్పుడు ఓట్లు వాటి మధ్య చీలిపోయేవి. కానీ ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి కూటములు ఏర్పాటు చేసుకొన్నప్పటికీ అదే పరిస్థితి నెలకొని ఉంది. కనుక ఆ కూటములు, పార్టీల మధ్య ఓట్లు చేలిపోయే అవకాశం ఉంది.కానీ జీ న్యూస్ ఛానల్ వారు ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో మొత్తం 243 అసెంబ్లీ సీట్లలో ఎన్డీయే కూటమికి 140, కాంగ్రెస్+జనతా పరివార్ కలిపి 70 సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది. ఎన్డీయే కూటమికి 50.8 శాతం ఓట్లు, జనతా పరివార్ కి 42.5 శాతం ఓట్లు పోల్ అవుతాయని తెలియజేసింది. కానీ సమాజ్ వాదీ పార్టీ, మజ్లీస్ పార్టీలు ఎవరివైపయినా మ్రోగ్గినట్లయితే మళ్ళీ ఈ అంచనాలు మారిపోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close