ఖమ్మం అభ్యర్థిపై కాంగ్రెస్‌లో సర్కస్ !

సోనియా గాంధీతో ప్రారంభించారు.. ఇప్పుడు మండవ వెంకటేశ్వరరావు పేరు వినిపిస్తోంది. ఈ మధ్యలో కనీసం ఓ డజన్ పేర్లు పరిశీలనకు వచ్చి ఉంటాయి. కానీ ఎవర్నీ ఖరారు చేయలేకపోతున్నారు. ఇదీ కాంగ్రెస్‌లో ఖమ్మం అభ్యర్థిపై జరుగుతున్న సర్కస్. సోనియా గాంధీ పోటీ చేయాలని … మొదట పీసీసీ తీర్మానం చేసి కేంద్ర పార్టీకి ఇచ్చింది. గెలుపు సులువు కావడమే ఖమ్మం స్పెషాలిటీ అని.. అందుకే సోనియా అక్కడ్నుంచి పోటీ చేయాలనుకున్నారని భావించారు.

అయితే సోనియా లేకపోతే మాకు అంటూ.. ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేతలంతా పట్టుబట్టారు. సోనియా రాజ్యసభకు వెళ్లారు. తర్వాత ప్రియాంక పేరు పరిశీలనలోకి వచ్చింది., ఆమె పోటీ చేయడంపై సందేహాలు ఉన్నాయి. ఈ లోపు అందరూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉంటే.. ముగ్గురూ తమ కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నించారు. కానీ హైకమాండ్ తర్జన భ ర్జన తర్వాత చాన్స్ లేదని చెప్పింది.

తర్వాత ఓ మాజీ మంత్రి అల్లుడు దగ్గర్నుంచి బీసీ నేతల వరకూ చాలా పేర్లు పరిశీలించారు చివరికి నందమూరి సుహాసిని పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావుపేరు తెరపైకి వచ్చింది. కమ్మ సామాజికవర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించనందున ఖమ్మం సీటు ఇవ్వాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. అందుకే మండవ పేరు పరిశీలనలోకి వచ్చింది.

ఇక రేసులో పారిశ్రామిక వేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. చివరికి ఎవరిని ఖరారు చేస్తారో కానీ.. సులువుగా గెలిచేస్తామని అనుకుంటున్న సీటులో అభ్యర్థి ఎంపిక ఇంత క్లిష్టంగా ఉంటుందా … అని నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close