కాపులకు 1,000 కోట్లు కేటాయించిన ఏపి ప్రభుత్వం

ఈరోజు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కాపు సంక్షేమ కార్పోరేషన్ కి రూ.1,000 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకొన్నారు. తెదేపా ఎన్నికల మ్యానిఫెస్టోలో కాపుల సంక్షేమానికి ఏడాదికి రూ. 1,000 కోట్లు చొప్పున ఐదేళ్ళలో ఐదువేల కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. కానీ ఆ హామీని ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయకపోవడంతో ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో తునిలో మొన్న ఆదివారంనాడు కాపు ఐక్య గర్జన సభ జరగడం, తదనంతర పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. దానితో తీవ్ర ఒత్తిడికి గురయిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఈ విధంగా చేయడం ద్వారా తన హామీని నిలబెట్టుకొన్నట్లు గాక కాపు గర్జనకు భయపడి నిర్ణయం తీసుకొన్నట్లు సంకేతం పంపినట్లవుతుంది. ఇది చూసి మిగిలిన కులాలు, వర్గాల వారు కూడా గర్జిస్తే ప్రభుత్వం వారందరి ముందు మోకరిల్లవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఇప్పటికిప్పుడు కాపులకు రిజర్వేషన్లు ప్రకటించడం సాధ్యం కాదు కనుక వారిని శాంతింపజేసేందుకే ఒకేసారి ఇంత బారీ మొత్తాని కేటాయించినట్లు భావించవలసి ఉంటుంది.

ఉద్యమబాట పట్టిన కాపు నేతలతో చర్చలు జరిపేందుకుగాను ఇద్దరు ఉపముఖ్యమంత్రులు, ఆరుగురు మంత్రులతో కూడిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసారు. వారే ప్రభుత్వం తరపున కాపు నేతలతో చర్చలు జరుపుతారు. జస్టిస్ మంజూనాద్ కమీషన్ నివేదిక ఇచ్చేంత వరకు గడువు తీసుకోనేందుకే కేబినేట్ సబ్ కమిటీని నియమించి ఉండవచ్చును. ప్రభుత్వం ఈ చర్యలు ముందే చేపట్టి ఉండి ఉంటే, సమస్య ఇంత తీవ్ర రూపం దాల్చేది కాదు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం మొదలుపెట్టిన ముద్రగడ పద్మనాభం ఇంకా దీనిపై స్పందించవలసి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close