ఆ ఐదుగురికి తప్ప మిగిలిన వారికి భారత్ ఓకే

మార్చి 19న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరుగబోయే భారత్-పాక్ టి-20 క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ఏడుగురు పాక్ దౌత్యవేత్తలకు భారత్ అనుమతి నిరాకరించడంతో పాక్ అందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ విదేశాంగ శాఖ పాకిస్తాన్ లో భారత హైకమీషనర్ జెపి సింగ్ ద్వారా భారత్ కి తమ నిరసన తెలియజేసింది. పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి మొన్న నేపాల్ లో భారత్ విదేశాంగ కార్యదర్శి ఎస్. జయ్ శంకర్ ని కలిసినప్పుడు ఈ విషయం గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.

అయినప్పటికీ పాక్ ఒత్తిడికి భారత్ తలొగ్గలేదు. కానీ డిల్లీలో పనిచేస్తున్న19 మంది పాక్ దౌత్యవేత్తలకు ఈ మ్యాచ్ చూసేందుకు కోల్ కతా వెళ్లేందుకు అనుమతించింది. అవసరమయితే మరి కొంతమందికి కూడా అనుమతిస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలియజేసారు.

“ఇటువంటి విషయాలలో కొన్ని నియమ నిబంధనలు పాటించవలసి ఉంటుంది. వాటి ప్రకారమే ముందుగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని మేము చాలాసార్లు పాకిస్తాన్ కి చెప్పాము కానీ వారు ఆ విషయంలో అశ్రద్ధ చూపుతుంటారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. అందుకే ఈ సమస్య తలెత్తింది. అయినప్పటికీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మొత్తం 19మంది పాక్ దౌత్యవేత్తలకు మ్యాచ్ చూసేందుకు భారత్ అనుమతి మంజూరు చేసింది,” అని వికాస్ స్వరూప్ చెప్పారు.

అయితే ఈ మ్యాచ్ చూసేందుకు పాకిస్తాన్ నుంచి భారత్ రావలనుకొన్న ఏడుగురు దౌత్యవేత్తలలో ఐదుగురికి పాక్ గూడచార సంస్థ ఐ.ఎస్.ఐ.తో సంబంధం ఉన్న కారణంగా వారికి కోల్ కతా వచ్చేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close