సౌదీలో ఇవ్వాళ్ళ ఒకే రోజు 47మందికి మరణశిక్ష అమలు

ఇంకా రాజరిక పరిపాలన కొనసాగుతున్న సౌదీ అరేబియా దేశంలో ఈరోజు ఏకంగా 47మందికి బహిరంగంగా ప్రజల ముందు తలలు నరికి మరణశిక్ష అమలుపరిచారు. మరణశిక్ష విదించబడిన వారిలో అత్యధికులు అల-ఖయిదా ఉగ్రవాదులు, కొందరు షియా తిరుగుబాటుదారులు మరియు నిమ్ర్-అల్-నిమ్ర్ అనే వర్గానికి చెందినవారు ఉన్నట్లు సౌదీ హోం శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. 2003-06 సం.ల మధ్యకాలంలో అల్-ఖయిదా ఉగ్రవాదులు సౌదీపై జరిపిన దాడులలో అనేకవందల మంది పౌరులు మరణించారు. సౌదీపై దాడులు జరిపిన అనేక వేలమంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వారిపై విచారణ జరిపించి మరణశిక్ష అమలుచేస్తోంది. అలాగే 2011-13 సం.ల మధ్యకాలంలో దేశంలో నిర్లక్ష్యానికి అణచివేతకు గురవుతున్న షియా ముస్లింలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసారు. వారిలో 47 మందికి మరణశిక్ష అమలుపరిచారు.

మరణశిక్ష అమలుచేసే ముందు వారి కారణంగా దేశంలో జరిగిన అల్లర్లు, వారి దాడుల్లో మరణించిన పౌరుల వీడియోలను సౌదీ జాతీయ న్యూస్ చానల్లో చూపించి, అటువంటి హేయమయిన నేరాలకు వారు పాల్పడినందుకే మరణశిక్ష విధిస్తున్నట్లు సౌదీ హోం శాఖ తెలియజేసింది. సౌదీ అరేబియా ప్రభుత్వం 2014 సం.లో 90 మందికి, 15సం.లో 157 మందికి ఈ సంవత్సరం మొదట్లోనే ఒకేసారి 47మందికి మరణశిక్ష అమలుచేసింది.

1995సం.లో అత్యధికంగా 192 మందికి మరణశిక్ష అమలుచేసింది. సౌదీ అరేబియా దేశంలో ఈ మరణశిక్షలు ప్రజలందరూ చూస్తుండగానే బహిరంగంగా అమలు చేస్తుంటారు. కనుకనే అక్కడ నేరాలు చేయడానికి అందరూ చాలా భయపడతుంటారు. కనుక నేరాలు తక్కువే. శాంతి భద్రతల సమస్యలు సాధారణంగా తలెత్తవు. సౌదీ ప్రభుత్వం ఇంత క్రూరంగా బహిరంగంగా మరణశిక్షలు అమలుచేయడాన్ని అంతర్జాతీయ మనవ హక్కుల సంఘాలు తప్పు పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

HOT NEWS

css.php
[X] Close
[X] Close