బెయిలా? ఆత్మహత్యా? తేల్చండి..

మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (వ్యాపం) కుంభకోణంలో నిందితులుగాఆరోపించబడి గౌలియర్ సెంట్రల్ జైలులో అండర్ ట్రైల్ (విచారణ) ఖైదీలుగా ఉన్న 70మంది మెడికల్ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు తమ ఆవేదనను ఒక లేఖ రూపంలో రాష్ట్రపతికి తెలియజేసినట్టు వార్తలొస్తున్నాయి. జైలు అధికారులు లేఖ విషయం ధృవీకరించకపోయినా మీడియాలో మాత్రం ఆధారాలతోసహా వార్తలొస్తున్నాయి.
అండర్ ట్రైల్ ఖైదీలుగా ఉన్న తమకు బెయిలైనా ఇప్పంచండి, లేదా ఆత్మహత్యచేసుకోవడానికి అనుమతైనా ఇవ్వండంటూ వీరు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. 2010లో ఎంబీబీఎస్ కోర్సులో చేరిన ఐదుగురు విద్యార్థులు కూడా కొద్దిరోజుల క్రితం రాష్ట్రపతికి లేఖ రాస్తూ, ఇదే విషయం తెలియజేశారు. వ్యాపం కుంభకోణం కేసును సీబీఐ తీసుకోవడానికి ముందు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణచేసింది. అయితే, సిట్ తమతప్పులేదని చెప్పినా ఇంకా తమకు ఈ జైలుజీవితమేమిటని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కాలేజీ యాజమాన్యం మరోపక్క తమను వేధింపులకు గురిచేస్తున్నదని కూడా వీరు ఆలేఖలో ప్రస్తావించారు.
ఇక ఇప్పుడు గౌలియర్ జైల్లో విచారణఖైదీలుగా ఉన్న 70 మంది విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు అదే బాటతొక్కుతూ, తమకు బెయిలైనా ప్రసాదించాలనీ, లేదా ఆత్మహత్యచేసుకోవడానికైనా అనుమతించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖరాయడం సంచలనం సృష్టిస్తోంది. వీళ్లంతా కొన్నినెలలుగా విచారణఖైదీలుగా ఉంటున్నారు. వ్యాపం ఉద్యోగులు, అధికారుల అవకతవకలకు తమను బాధ్యులను చేశారని వీరు ఆలేఖలో ఆరోపించారు. నెలల తరబడి జైల్లో ఉంటున్నా, విచారణ ముగుస్తుందన్న ఆశారేఖలు కనిపించడంలేదని వారు వాపోయారు. సామాజికంగా, మానసికంగా తాముక్రుంగిపోయామనీ, అందుకే రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నామని అంటున్నారు.
తమను అరెస్ట్ చేసి జైలుకు తీసుకొచ్చే సమయానికి తాము అనేక ఆస్పత్రిల్లో జూనియర్ డాక్టర్లుగా పనిచేస్తున్నామనీ, ఉన్నట్టుండి జైలుపాలుకావడంతో తమ కుటుంబపరిస్థితి అధ్వాన్నంగా తయారైందని మెడికల్ విద్యార్థులు చెబుతున్నారు. భోపాల్, జబల్పూర్ జైళ్లలోని ఇదే కేసు నిందితులను బెయిల్ పై విడుదల చేసినప్పుడు తమ పరిస్థితి ఎందుకిలా అయిందని వారు రాష్ట్రపతికి రాసినలేఖలో ప్రశ్నించారు.
ఇప్పటికే 40మంది వ్యాపంకేసుతో లింకులున్నవారు అనుమానస్పదంగా మరణించారు. కాగా, 2013లో వ్యాపం కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటినుంచీ రెండువేలకు పైగానే అరెస్టులయ్యాయి. వ్యాపం కుంభకోణంలో రాజకీయ పెద్దలు, మధ్యవర్తుల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. వృత్తిపరమైన ఉద్యోగాలు, కోర్సులకు సంబంధించిన ప్రవేశపరీక్ష నిర్వహించే బోర్డులో అనేక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో వ్యాపం కుంభకోణం వెలుగుచూసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close