విజయవాడ దుర్గగుడి వద్ద ఫ్లై ఓవర్ కి 5న శంఖుస్థాపన

విజయవాడ వాసుల చిరకాల స్వప్నం నిజం కాబోతోంది. ఇంద్రకీలాద్రి దిగువన నగరంలోకి ప్రవేశించడానికి ఉన్న ఇరుకు రోడ్డు స్థానంలో విశాలమయిన ఆరు వరుసలతో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగబోతోంది. ఈ కనకదుర్గ గుడి ఫ్లై ఓవర్ కి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ డిశంబర్ 5న ఉదయం 9గంటలకి శంఖు స్థాపన చేయబోతున్నారు. ఆయనతో బాటు కేంద్ర మం త్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి మొత్తం రూ.464 కోట్లు వ్యయం అవుతాయని అంచనా వేశారు. దానిలో కేంద్రప్రభుత్వం తన వాటాగా రూ.350 మంజూరు చేసింది. మిగిలిన రూ.114 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ ఫ్లైఓవర్ ని వచ్చే ఏడాది కృష్ణా పుష్కారాలలోగా నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇప్పటికే ఈ ఫ్లైఓవర్ నిర్మించబోయే స్థలంలో ఉన్న నివాస, వాణిజ్య సముదాయాలను తొలగించడం మొదలుపెట్టారు. డిశంబర్ 5న శంఖుస్థాపన జరిగిన వెంటనే వీలయినంత త్వరగా పనులు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే నగరంలోకి ప్రవేశించే, బయటకు వెళ్ళే వాహనాలు దుర్గ గుడి వద్ద గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకొనే సమస్య ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close