గౌహతీలో బాంబు ప్రేలుళ్ళు

అస్సాం రాష్ట్రంలోని గౌహతీలో నిత్యం రద్దీగా ఉండే ఫాన్సీ బజార్ లో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు రెండు వరుస బాంబు ప్రేలుళ్ళు జరిగాయి. అదృష్టవశాత్తు ఈ ప్రేలుళ్ళలో ప్రాణ నష్టం జరుగలేదు. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఫాన్సీ బజారులో ఒక మిఠాయి దుకాణం దగ్గరలో ఉన్న ఒక చెత్త కుండీలో బాంబులు అమర్చారు. కొన్ని సెకండ్ల వ్యవధిలో రెండు బాంబులు ఒకదాని తరువాత మరొకటి పేలాయి. కానీ అవి అంత శక్తివంతమయినవి కాకపోవడంతో ప్రనానష్టం జరగలేదు. బాంబు ప్రేలుళ్ళతో ఉలిక్కిపడిన జనం ఏమవుతోందో తెలియక భయంతో పరుగులు తీసారు. గాయపడిన ఇద్దరు వ్యక్తులని స్థానిక మేహేద్ర మోహన్ చౌదరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వాఈ సమాచారం అందుకొన్న వెంటనే పోలీసులు, అక్కడికి చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. బాంబు స్క్వాడ్ బృందాలు పరిసరాలన్నీ గాలించారు. కానీ మరెక్కడా బాంబులు దొరకలేదు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుండి ఆధారాలు సేకరించారు. అది ఉల్ఫా ఉగ్రవాదుల పనే అయుండవచ్చునని గౌహతీ పోలీస్ కమీషనర్ ముకేష్ అగర్వాల్ అనుమానం వ్యక్తం చేసారు. ఇంతవరకు ఎవరూ ఈ ప్రేలుళ్ళకు తామే భాద్యులమని ప్రకటించుకోలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close