మోడీ ప్రభుత్వాన్ని విమర్శించిన తెదేపా ఎంపీ

తెదేపా అమలాపురం ఎంపి పి. రవీంద్ర బాబు మోడీ ప్రభుత్వానికి నిన్న లోక్ సభలో చురకలు వేశారు. దేశంలో దాదాపు సగం మంది దారిద్ర్యరేఖకి దిగువన ఉన్నప్పుడు మనకి బులెట్ రైళ్ళు అవసరమా? అని ప్రశ్నించారు. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడానికి ఇటువంటి అనవసరమయిన ప్రాజెక్టులు భుజానికెత్తుకోవడం సబబు కాదని ఆయన అన్నారు. లోక్ సభలో నిన్న జరిగిన ఉప పద్దులపై జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేసారు. బులెట్ ట్రైన్ వంటి బారీ ప్రాజెక్టుల మీద డబ్బు ఖర్చు చేయడం కంటే దేశంలో నిరుపేదల సంక్షేమం కోసం ఖర్చు చేయడం మేలని అన్నారు. భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పుకొంటునప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ ఇంకా నిలబడలేదని, కనుక మన అవసరాలకు తగ్గట్లుగా మన ప్రాధాన్యతలుండాలని ఆయన మోడీ ప్రభుత్వానికి హితవు పలికారు. భారత్ రక్షణ రంగంపై ఖర్చు చేస్తున్న రూ.2లక్షల కోట్ల వ్యయాన్ని కూడా తగ్గించుకోవలసిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తసారు.

ఆయన చెప్పిన ఈ హితోపదేశాన్ని మోడీ ప్రభుత్వం పట్టించుకోదని అందరికీ తెలుసు. కానీ దానిని వ్యతిరేకించినందుకు బీజేపీ నేతలు రవీంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేయవచ్చును. రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వాలని రవీంద్ర బాబు మోడీ ప్రభుత్వాన్ని కోరారు. పోలవరం నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కూడా ఆయన కోరారు. ఏపీతో సహా దేశంలో మరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని రెండు మూడు రోజుల క్రితమే కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ లోక్ సభలో విస్పష్టంగా చెప్పారు. అయినా రవీంద్రబాబు మళ్ళీ దాని కోసం లోక్ సభలో ఒత్తిడి చేయడం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

అలీ ఎక్క‌డ‌.. క‌నిపించ‌డే?

టీడీపీ, జ‌న‌సేన నుంచి సీటు ఆశించి భంగ‌ప‌డి, వైకాపా గూటికి చేరిన‌వాళ్ల‌లో అలీ ఒక‌డు. కేవ‌లం వైకాపా త‌న‌కు సీటు ఇస్తుంద‌న్న కార‌ణంతోనే స్నేహితుడైన ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని కూడా దూషించే సాహ‌సానికి ఒడిగ‌ట్టాడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close