ఇవేమీ వ్యూహాలో… ఏమిటో…

వైకాపా ఎమ్మెల్యే రోజా విషయంలో ఆ పార్టీ చాలా తప్పటడుగులు వేస్తునట్లే కనబడుతోంది. ముఖ్యమంత్రితో అనుచితంగా ప్రవర్తించినందుకు ఆమెను సభ నుంచి సస్పెండ్ చేయబడినప్పుడు ఆమె స్పీకర్ కి క్షమాపణలు చెప్పుకొని ఉండే ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేసి ఉండేవారేమో? కానీ ఆవిధంగా చేయకుండా, ఆమెను వెనకేసుకొని వస్తూ తెదేపాపై ఎదురు దాడికి దిగడం వలన సమస్య ఇంకా జటిలం చేసుకొన్నారు. ఒకవేళ రోజా వైఖరిలో మార్పు వస్తే ఆమెపై సస్పెన్షన్ విషయం గురించి పునరాలోచిస్తామన్నట్లు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడారు. ఆ అవకాశాన్ని కూడా కాలదన్నుకొని న్యాయపోరాటం చేస్తామని జగన్మోహన్ రెడ్డి సభని బహిష్కరించి వెళ్ళిపోయారు.

శాసనసభలో తీసుకొనే ఎటువంటి నిర్ణయాలని న్యాయస్థానాలు కూడా ప్రశ్నించలేవనే సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలియదనుకోలేము. తెరాసలో చేరిన తెదేపా, వైకాపా కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీల నేతలు సుప్రీం కోర్టు వరకు వెళ్ళినా స్పీకర్ పరిధిలో ఉన్న అంశాలలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన విషయం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవలసిన అవసరం ఉంది. కనుక రోజా సస్పెన్షన్ విషయంలో కూడా అదే జరుగవచ్చును. ఒకవేళ జగన్ కి ఈ విషయం తెలియదనుకొన్నా మంత్రి యనమల రామకృష్ణుడు సభలో ఆయనకి తెలియజేసినప్పుడయినా మేల్కొని ఉండాలి. కానీ మేల్కొనలేదు. మేల్కొనలేదు అనేకంటే మేల్కొనడానికి ఇష్టపడలేదు అని చెప్పాలేమో?

ఎందుకంటే స్పీకర్ కి క్షమాపణలు చెప్పుకొని సస్పెన్షన్ ఉపసంహరించుకోవడం వలన తెదేపాకు చులకనవుతామనే భయం ఉంది. అదీ కాక ముఖ్యమంత్రి పట్ల సభలో అనుచితంగా వ్యవహరించినట్లు అంగీకరించినట్లవుతుంది. అందుకే ఈ వ్యవహారంలో తమదే తప్పని తెలిసి ఉన్నప్పటికీ, న్యాయస్థానంలో తమకేసు నిలవదని తెలిసి ఉన్నప్పటికీ న్యాయపోరాటం చేస్తామని చెపుతున్నారనుకోవాల్సి ఉంటుంది. కానీ ఆవిధంగా చేయడం వలన అధికార పార్టీని ఏడాదిపాటు నిందించడానికి వైకాపాకు అవకాశం కలుగుతుంది. ఆ సాకుతో స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైకాపా భావిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. కానీ ఆ పని వచ్చే సమావేశాలలో చేయాలనుకొంటున్నట్లు వార్తలు వచ్చేయి కనుక అంతవరకు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం అనే అంశంపై కూడా మాట్లాడుకొనే అవకాశం దక్కుతుంది.

అయితే రాష్ట్రానికి పెద్దవాడయిన ఒక ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా మాట్లాడి, న్యాయపోరాటం చేస్తే ఓడిపోతామని తెలిసి కూడా అందుకు సిద్దపడటం, స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఆలోచన చేయడం, ఆ తీర్మానాన్ని నెగ్గించుకోలేక ఓడిపోతే మళ్ళీ దాని వలన ప్రజలలో నవ్వులపాలవుతామనే విషయం వైకాపా గ్రహించకపోవడం చాలా విచిత్రంగా ఉంది. ప్రస్తుతం ఆవేశంలో ఏదో ప్రకటించేసినా తరువాత వాటన్నిటి పై పునరాలోచించుకొంటుందేమో? చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close