పార్లమెంటులో కూడా సీట్ బెల్ట్ కోసం వెతుకొంటారు మోడీ!

జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య విమర్శలు కూడా పెరుగుతున్నాయి. తెరాస మంత్రి కె.తారక రామారావు నేరుగా ప్రధాని నరేంద్ర మోడి మీదనే విమర్శలు గుప్పిస్తున్నారు. నిత్యం విమానాలలో తిరగడం అలవాటయిపోయిన కారణంగా ఆయన పార్లమెంటులో కూర్చోనప్పుడు కూడా సీట్ బెల్టు కోసం వెతుకొంటారు, అని ఎద్దేవా చేసారు. తెలంగాణా రాష్ర్టం ఏర్పడి ఇప్పటికి 18 నెలలు అయినప్పటికీ ఇంతవరకు ఆయనకి తెలంగాణా వచ్చేందుకు తీరిక, ఆసక్తి లేవని కానీ నిత్యం విదేశాలు తిరుగుతుంటారని విమర్శించారు.

కె.తారక రామారావు నిన్న ధూల్ పేటలోని జుమ్మేరాత్‌ బజారులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడిని విమర్శించడమే కాకుండా రాష్ట్ర బీజేపీ నేథలకి కూడా సవాలు విసిరారు. ఎవరూ అడగకపోయినా బీహార్ కి 1.25 లక్షల కోట్లు ఆర్ధిక ప్యాకేజి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రూ.80, 000 కోట్ల ప్యాకేజి ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణాకు ఎందుకు పైసా విదిలించడం లేదు? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిలకు దమ్ముంటే నరేంద్ర మోడీ వద్దకు వెళ్లి తెలంగాణా రాష్ట్రానికి కూడా లక్ష కోట్లు ఆర్ధిక ప్యాకేజి అడిగి తీసుకురావాలి అని సవాలు విసిరారు. తమ పార్టీ బీజేపీలాగ హామీలు ఇచ్చి మరిచిపోయే పార్టీ కాదని అన్నారు. ధూల్ పేట ప్రజల కోసం ఆ ప్రాంతంలో ఒక పెద్ద పరిశ్రమను నెలకొల్పబోతున్నట్లు కె.తారక రామారావు ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోడిపై కె.టి.ఆర్. చేస్తున్న విమర్శలను కేంద్ర కార్మిక, పెట్రోలియం శాఖా మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, బండారు దత్తాత్రేయ తప్పు పట్టారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి జన్మదినం సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన విస్తృతస్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి ధర్మేన్ ప్రాధాన్ మాట్లాడుతూ “కె.టి.ఆర్. ముఖ్యమంత్రి కుమారుడు అయినంత మాత్రాన్న ఆయన అంత అహంకారం ప్రదర్శించడం మంచి పద్దతి కాదు. ప్రధాని మోడిని విమర్శించేముందు, మీ తండ్రి కేసీఆర్ వారంలో ఎన్నిసార్లు సచివాలయానికి వస్తున్నారో తెలుసుకోవాలని అన్నారు. ఒకవేళ ప్రధాని మోడీ ఏమి చేస్తున్నారో కె.టి.ఆర్.కి తెలియకపోతే, తన తండ్రి కేసీఆర్ ని అడిగి తెలుసుకొంటే మంచిది,” అని హితవు పలికారు.

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ “రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పధకాలకు కేంద్రమే నిధులు అందిస్తోందనే విషయం మంత్రి కె.టి.ఆర్.కి తెలియదా? తెలంగాణా ప్రభుత్వం అడగగానే నిరంతర విద్యుత్ సరఫరా పధకం మంజూరు చేసిన సంగతి ఆయనకి తెలియదా?ఎంఎంటీఎస్‌ రెండో దశను పూర్తి చేయడానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తున్న విషయం ఆయనకీ తెలియదా? కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇంత చేస్తుంటే కె.టి.ఆర్. నోటికి వచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోడిని విమర్శించడం తగదు,” అని హితవు పలికారు. జి.హెచ్.ఎం.సి.ఎన్నికలలో తెదేపా, బీజేపీ కూటమిని గెలిపించినట్లయితే కేంద్రం హైదరాబాద్ ని అభివృద్ధి చేస్తుందని బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

య‌శ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌

'కేజీఎఫ్`తో య‌శ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. 'కేజీఎఫ్‌' త‌ర‌వాత య‌శ్ ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో గీతు మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి...

శింగనమల రివ్యూ : కాంగ్రెస్ రేసులో ఉన్న ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం !

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేసులో ఉందని చెప్పుకుంటున్న ఒకే ఒక్క నియోజకవర్గం శింగనమల. మాజీ మంత్రి శైలజానాథ్ గతంలో...

ఫోటోలు – టీడీపీ మేనిఫెస్టోలో వైసీపీకి కనిపిస్తున్న లోపాలు !

వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో జరుగుతున్న చర్చ జీరో. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం లేదు. కానీ టీడీపీ మేనిపెస్టోపై టీడీపీ నేతలు ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రచార కార్యక్రమం పెట్టుకున్నారు. అదే...

టార్గెట్ పవన్ కళ్యాణ్ …పొన్నూరులో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం

ఏపీలో టీడీపీ సారధ్యంలోని కూటమిదే అధికారమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండటంతో వైసీపీ నేతల్లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును అడ్డుకుంటే అది వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని భావించి పవన్ ను వరుసగా టార్గెట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close