ఆయుత చండీయాగశాలలో అగ్ని ప్రమాదం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగం ఈరోజుతో పూర్తవుతుంది. ఇంతవరకు ఎటువంటి అపశ్రుతులు లేకుండా అంతా సవ్యంగా సాగిపోయింది. కానీ చివరి రోజయిన ఈరోజున యాగశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. యాగం విరామ సమయంలో హోమ గుండంలో ఎవరో ఒకేసారి చాలా నెయ్యి పోయడంతో అగ్ని జ్వాలలు ప్రజ్వలించి పైన గడ్డితో నిర్మించిన కప్పుకు అంటుకొని మంటలు వ్యాపించాయి. తక్షణమే అగ్నిమాపక దళాలు అక్కడికి చేరికొని మంటలను ఆర్పివేశాయి. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హెలికాఫ్టర్ లో అక్కడికి చేరుకొన్నారు. కానీ క్రిందన ఉన్న సెక్యూరిటీ సిబ్బంది సలహా మేరకు ఆయన క్రిందకు దిగకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. మళ్ళీ కొద్ది సేపు తరువాత యాగం యధావిధిగా ఆరంభించారు. ఈరోజు సాయంత్రం యాగం పూర్తవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close