పతంజలి ఉత్పత్తులను బహిష్కరించడం సరికాదు: బాలకృష్ణ

పతంజలి ఉత్పతులలో గోమూత్రం వినియోగిస్తునందున వాటిని ముస్లింలు ఎవరూ వాడరాదని తమిళనాడుకు చెందిన తౌహీద్‌ జమాత్ అనే ముస్లిం మత సంస్థ మూడు రోజుల క్రితం ఒక ఫత్వా జారీ చేసింది. ఇస్లాం మతం గోమూత్రం వాడటం తప్పుగా భావిస్తుంది కనుక దానితో తయారవుతున్న పతంజలి ఉత్పత్తులను ముస్లింలు అందరూ బహిష్కరించాలని ఫత్వాలో పేర్కొంది. ఊహించినట్లే ఆ ఫత్వాపై పతంజలి సంస్థ వెంటనే స్పందించింది.

“మా పతంజలి సంస్థ 700కి పైగా వివిధ రకాల ఉత్పత్తులు చేస్తుంది. వాటిలో కేవలం ఐదింటిలో మాత్రమే గోమూత్రం వాడుతాము. ఆ విషయం సదరు ఉత్పత్తుల ప్యాకెట్లపై స్పష్టంగా పేర్కొంటాము. దానిని రహస్యంగా ఉంచవలసిన అవసరమేమీ లేదు. మా సంస్థ తయారు చేసే ప్రతీ ఉత్పత్తిపై దాని పూర్తి వివరాలను పేర్కొంటాము. కనుక మా అన్ని ఉత్పత్తులలో గోమూత్రం వాడుతున్నామన్న ఆరోపణ సరికాదు. మా ఉత్పత్తులను వాడవద్దని ఫత్వా జారీ చేసిన సంస్థకు వాటి గురించి సరయిన అవగాహన లేకపోవడం చేతనే వాటిని బహిష్కరించాలని కోరినట్లుంది. పతంజలి సంస్థ తయారు చేసే ఉత్పత్తులన్నీ ఏ మతం, ప్రాంతానికి చెందినవారయినా వాడేవిధంగానే తయారుచేసాము. కనుక మా ఉత్పత్తులపై ప్రజలు ఎటువంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోనవసరం లేదు. అందరూ ఉపయోగించవచ్చును,” అని బాబా రాందేవ్ శిష్యుడు బాలకృష్ణ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close