సౌదీలో ఇవ్వాళ్ళ ఒకే రోజు 47మందికి మరణశిక్ష అమలు

ఇంకా రాజరిక పరిపాలన కొనసాగుతున్న సౌదీ అరేబియా దేశంలో ఈరోజు ఏకంగా 47మందికి బహిరంగంగా ప్రజల ముందు తలలు నరికి మరణశిక్ష అమలుపరిచారు. మరణశిక్ష విదించబడిన వారిలో అత్యధికులు అల-ఖయిదా ఉగ్రవాదులు, కొందరు షియా తిరుగుబాటుదారులు మరియు నిమ్ర్-అల్-నిమ్ర్ అనే వర్గానికి చెందినవారు ఉన్నట్లు సౌదీ హోం శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. 2003-06 సం.ల మధ్యకాలంలో అల్-ఖయిదా ఉగ్రవాదులు సౌదీపై జరిపిన దాడులలో అనేకవందల మంది పౌరులు మరణించారు. సౌదీపై దాడులు జరిపిన అనేక వేలమంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వారిపై విచారణ జరిపించి మరణశిక్ష అమలుచేస్తోంది. అలాగే 2011-13 సం.ల మధ్యకాలంలో దేశంలో నిర్లక్ష్యానికి అణచివేతకు గురవుతున్న షియా ముస్లింలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసారు. వారిలో 47 మందికి మరణశిక్ష అమలుపరిచారు.

మరణశిక్ష అమలుచేసే ముందు వారి కారణంగా దేశంలో జరిగిన అల్లర్లు, వారి దాడుల్లో మరణించిన పౌరుల వీడియోలను సౌదీ జాతీయ న్యూస్ చానల్లో చూపించి, అటువంటి హేయమయిన నేరాలకు వారు పాల్పడినందుకే మరణశిక్ష విధిస్తున్నట్లు సౌదీ హోం శాఖ తెలియజేసింది. సౌదీ అరేబియా ప్రభుత్వం 2014 సం.లో 90 మందికి, 15సం.లో 157 మందికి ఈ సంవత్సరం మొదట్లోనే ఒకేసారి 47మందికి మరణశిక్ష అమలుచేసింది.

1995సం.లో అత్యధికంగా 192 మందికి మరణశిక్ష అమలుచేసింది. సౌదీ అరేబియా దేశంలో ఈ మరణశిక్షలు ప్రజలందరూ చూస్తుండగానే బహిరంగంగా అమలు చేస్తుంటారు. కనుకనే అక్కడ నేరాలు చేయడానికి అందరూ చాలా భయపడతుంటారు. కనుక నేరాలు తక్కువే. శాంతి భద్రతల సమస్యలు సాధారణంగా తలెత్తవు. సౌదీ ప్రభుత్వం ఇంత క్రూరంగా బహిరంగంగా మరణశిక్షలు అమలుచేయడాన్ని అంతర్జాతీయ మనవ హక్కుల సంఘాలు తప్పు పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : లా అండ్ ఆర్డర్‌ను గుర్తు చేసుకోండి !

రాష్ట్రంలో ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వడం అనేది ప్రభుత్వాలు ప్రజలకు కల్పించిన మొదటి సౌకర్యం. కానీ గత ఐదేళ్లుగా ఏపీలో ఎప్పుడైనా శాంతిభద్రతలు ఉన్నాయా?. పోనీ ప్రజలు నిర్భయంగా బతగలిగారా ?. పోనీ...

కళ్ల ముందు ఓటమి – వాస్తు మార్పులతో జగన్ ప్రయత్నం !

అభ్యర్థులను మార్చారు వర్కవుట్ అవలేదు. బస్సు యాత్ర పేరుతో తనను తాను మార్చుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు వర్కవుట్ అవ్వలేదు.. ప్రజలు మార్పు చేయడానికి సిద్ధమయ్యారని స్పష్టత రావడంతో చివరి...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కదలిక… ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు..!?

ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్తబ్దత నెలకొందని ప్రచారం జరుగుతోన్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులు ప్రధాన సూత్రధారి ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్...

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close