సీమాంధ్రుల ఓటు ఎటు?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నగారా మోగింది. ప్రతిపక్షాలను పూర్తి చీకట్లో ఉంచి, రిజర్వేషన్లు, షెడ్యూలు, నోటిఫికేషన్ ఒకేసారి ప్రకటించి, ఏడో రోజున పోలింగ్ జరిపి ఎక్కువ సీట్లను గెలుచుకోవాలని తెరాస ప్లాన్ చేసిందని వార్తలు గుప్పుమన్నాయి. ఎన్నికల ప్రక్రియ కుదింపును తప్పు పట్టిన హైకోర్టు, ప్రభుత్వానికి మొట్టికాయ వేసింది. దీంతో సర్కార్ కు షాక్ తగిలింది. అధికార పార్టీ ఊహాలోకంలో విహరించడం మానేసి, వాస్తవం లోకి వచ్చింది.

తెరాస చాలా కాలం నుంచే ప్రచారం మొదలుపెట్టింది. హైదరాబాద్ లో ఇక వేరే పార్టీకి సందు లేనంతగా హోర్డింగు ప్రకటనలు గుప్పించింది. ఇంతకీ నగరంలోని సీమాంధ్రుల ఓటు ఎవరికి అనేది ఓ కీలకమైన విషయం. ఉద్యమ సమయంలో సీమాంధ్రులపై తీవ్రంగా విరుచుకు పడ్డ కేసీఆర్, ఆ తర్వాత చేతల్లో ఒక విధంగా, మాటల్లో ఒక విధంగా ప్రవర్తించారు.

నగరంలో నివసించే వారంతా తెలంగాణ బిడ్డలే అని కేసీఆర్ మాటల్లో చెప్తూ వచ్చారు. 1952 కు ముందు తెలంగాణలో స్థిరపడ్డ వారు మాత్రమే స్థానికులంటూ ఉత్తర్వులు ారీ చేశారు. ఇది సీమాంధ్రులకు నష్టం చేసే విషయం. ఇలా కేసీఆర్ మాటలకూ చేతలకూ పొంతన లేదని సీమాంధ్రులకు అర్థమైంది. రేపు ఎన్నికల్లో కొందరు సీమాంధ్రులకు తెరాస టికెట్లు ఇచ్చినంత మాత్రాన, ఆ ప్రాంతం వారు గంపగుత్తగా కారు గుర్తుకు ఓటేస్తారా?

పోనీ, పాత విషయం మర్చిపోదామనుకుంటే ఈ మధ్యే సీమాంధ్రులకు చెందిన లక్షల ఓట్లను తొలగించడానికి ప్రభుత్వం ప్లాన్ చేసిందనే వార్తలు కలకలం రేపాయి. ఇప్పటికే 6 లక్షలకు పైగా ఓట్లను తొలగించారంటూ ఆందోళన మొదలైంది. కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన తర్వాత విచారణ మొదలైంది. ఓట్ల తొలగింపు అంశం కోర్టు వరకూ వెళ్లింది. సీమాంధ్రులకు తాము అండగా ఉంటామని శశిధర్ రెడ్డి ప్రకటించారు. నిరుడు సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సీమాంధ్రులు టీడీపీకి ఓటు వేసినట్టు ఫలితాలు స్పష్టం చేశాయి. టీడీపీ అయితే తమకు అండదండగా ఉంటుందని అప్పట్లో భావించారు. బీజేపీ సైతం జాతీయ పార్టీగా సీమాంధ్రులకు బాసటగా ఉంటానని చెప్తోంది.

ఇంతకీ సీమాంధ్రుల్లో అత్యధికులు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందనేది పెద్ద చర్చనీయాంశమైంది. టీడీపీయే పెద్ద దిక్కుగా భావించి సైకిల్ గుర్తుకు ఓటు వేస్తారని తెలుగు తమ్ముళ్లు ఆశపడుతున్నారు. ఓట్ల తొలగింపుపై పోరాడిన తమకే మద్దతిస్తారని కాంగ్రెస్ నమ్ముతోంది. అధికారంలో ఉన్నాం, కడుపున పెట్టుకుని చూసుకుంటామని ప్రకటించాం కాబట్టి కారు గుర్తుకే ఓటేస్తారని తెరాస నేతలు చెప్తున్నారు. చివరకు వీరి మద్దతును పొందే పార్టీ ఏదో తెలియాలంటే ఫిబ్రవరి 5 వరకు, అంటే కౌంటింగ్ వరకు ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close