బంపర్ ఆఫర్ కొట్టేసిన కీర్తి

‘నేను శైలజ’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన మలయాళీ భామ కీర్తి సురేష్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమెకు రెండవ సినిమాతోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జత కట్టేందుకు అవకాశం దక్కింది. అయితే అందుకు ఆమె ప్రతిభ ఒకటే కారణం కాదు. ఆమెకు అదృష్టం కూడా ఉండబట్టి అన్నీ కలిసివచ్చి ఆమెకు ఆ అవకాశం దక్కింది.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తన్ని ఒరువన్’ సినిమాని తెలుగులో రామ్ చరణ్ తేజ్ తో రీమేక్ చేస్తున్నారు. నిర్మాతలు దాని బడ్జెట్, షూటింగ్ షెడ్యూల్ విషయంలో ముందే కొన్ని పరిమితులు విదించుకొన్నారు. ఈ సినిమాకి మొదట శ్రుతీ హాసన్ న్ని హీరోయిన్ గా అనుకొన్నారు. కానీ ఆమె డేట్స్, పారితోషికం రెండూ కూడా వారికి అందుబాటులో లేకపోవడంతో కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన కీర్తి సురేష్ వారి దృష్టిని ఆకర్షించింది.

ఆమె తన మొట్టమొదటి సినిమాతోనే తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకొంది. పైగా ఆమె చేతిలో వేరే మరే సినిమాలు కూడా లేవు కనుక ఏకబిగిన సాగే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు సినిమా చేయడానికి ఇబ్బంది ఉండదు. కొత్త హీరోయిన్ కనుక పారితోషికం కూడా పెద్దగా ఉండదు. కనుక ఆమెనే ఈ సినిమాకి హీరోయిన్ గా ఎంచుకొన్నారు. త్వరలోనే ఆమెకు స్క్రీన్ టెస్ట్ చేస్తారు. అందులో కూడా ఒకే అయిపోతే ఇక రామ్ చరణ్ తేజ్ పక్కన హీరోయిన్ గా చాన్స్ కొట్టేసినట్లే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close