బుజ్జగింపు: గిడ్డి ఈశ్వరి కి వైసీపీ అధినేత జగన్ ఫోన్‌

విశాఖపట్నం జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీ వీడనున్నారని, టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటారని, ఈ మేరకు అనుచరులతో ఆమె సమాలోచనలు జరుపుతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్టణం జిల్లా పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరితో వైసీపీ అధినేత జగన్ శనివారం ఫోన్‌లో మాట్లాడారు.

మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు వైసీపీలో చేరడంపై గిడ్డి ఈశ్వరి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పాడేరు టికెట్ ఇవ్వలేదనే కారణంతో టీడీపీలో చేరిన కుంభా రవిబాబు ఇప్పుడు తిరిగి వైసీపీలో చేరారు. అరకు టికెట్ ను రవిబాబుకే ఇస్తామనే హామీ వైసిపి నుంచి వచ్చాకే ఆయన పార్టీలో చేరినట్టు సమాచారం. దీంతో అలకబూనిన ఆమె వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర ప్రారంభానికి ముందే కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ఆమెతో మాట్లాడినట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది. అనకాపల్లి పార్లమెంటు పార్టీ ఇన్‌చార్జి జగన్‌ను కలిసి గిడ్డిఈశ్వరి అంశంపై చర్చించినట్లు సమాచారం.

గిడ్డి ఈశ్వరితో ఫోన్‌లో మాట్లాడిన జగన్ సమస్య ఏంటో తన వద్దకు వచ్చి చెప్పాలని ఆమె కు సూచించినట్లు తెలుస్తోంది. ఇంతకాలం తాను చెప్పిం ది పట్టించుకోకుండా ఇప్పుడు పార్టీ మార్పు వార్తలు వచ్చాయని ఫోన్ చేశారే కాని తన సమస్య పరిష్కరించడానికి కాదన్నట్లుగా గిడ్డి ఈశ్వరి మాట్లాడినట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close