మంత్రులు, ముఖ్యమంత్రిపై రాయపాటి అసంతృప్తి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బ తినబోతోందని గ్రహించి ఆ పార్టీతో ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని పుటుక్కున త్రెంచేసుకొని తెదేపాలో చేరిన కాంగ్రెస్ నేతలలో రాయపాటి సాంభశివరావు కూడా ఒకరు. పార్టీలో చేరుతూనే నరసరావుపేట ఎంపి సీటును దక్కించుకొన్నారు కూడా. కానీ ఆయన తరచూ పార్టీపై ఏదో రూపంలో అసంతృప్తి వెలిబుచ్చుతూనే ఉన్నారు.

గురువారంనాడు గుంటూరుజిల్లా ప్రతిప్పాడు మండలంలో గొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠాశాల స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన మాట్లాడుతూ “మన జిల్లాలో గురజాల, వినుకొండ, మాచర్ల నియోజకవర్గాలు తెలంగాణ, రాయలసీమ కంటే చాలా వెనుకబడి ఉన్నాయి. ప్రజలకి త్రాగడానికి నీళ్ళు కూడా దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారని నేను మంత్రులకు చెపితే వారు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి రోజుకి 18 గంటలు కష్టపడుతున్నారు. కానీ మంత్రులు మాత్రం ప్రజా సమస్యల పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదు. అసలు మంత్రుల మధ్య సమన్వయమే లేదు. శంఖుస్థాపనలు చేసి శిలాఫలకాలపై పేర్లు వేసుకోవడంపై ఉన్న శ్రద్ద ఆ పనులు చేపట్టడంలో కనిపించదు. రైల్వే జోన్ గురించి గట్టిగా మాట్లాడుదామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దని కోపడుతుంటారు. పార్టీలో ఇమడలేక చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఏమి చేస్తాం తప్పదు కదా…” అని అన్నారు.

తెదేపాలో ఒకరిద్దరు మంత్రులు తప్ప మిగిలినవారి పనితీరు బాగోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశాలలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అదే విషయాన్నీ ఇప్పుడు రాయపాటి సాంభశివరావు నోటి ద్వారా మరోసారి బయటపడింది. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కోసమే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ వంటి హామీల గురించి గట్టిగా అడగడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు రాయపాటి కూడా వారి ఆరోపణలను దృవీకరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం సహాయ సహకారాలు చాలా అవసరం కనుక కేంద్రంతో సఖ్యతగా మెలగడం మంచిదే. కానీ దాని వలన రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతున్నపుడు కూడా ఎంపిలని మాట్లాడనీయకుండా కట్టడి చేసినట్లయితే, చివరికి తెదేపా, బీజేపీలు రెండూ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వచ్చే ఎన్నికలలోగా రాజధాని ప్రాధమిక దశ నిర్మాణం పూర్తి చేయడం, పోలవరం పూర్తి చేయడం, వైజాగ్, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చేయడం, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని మళ్ళీ గాడిన పెట్టడం వంటి పనులన్నీ పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పుకొన్నారు. అప్పుడే దాదాపు రెండేళ్ళ కాలం పూర్తి కావస్తోంది కానీ ఇంతవరకు ఆయన చెప్పినవాటిలో ఏ ఒక్కపనీ పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. అలాగే ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ వంటి హామీలపై మాట తప్పినందుకు బీజేపీ కూడా వచ్చే ఎన్నికలలో మూల్యం చెల్లించవలసి రావచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close