బొత్స మూడక్షరాల మంత్రమేమిటి?

వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు రావలసినంత ప్రచారం రావడం లేదని వైసీపీ మధనపడుతున్నది. వాస్తవానికి తెలుగు360లో గతంలోనే ఈ అంశం చెప్పుకున్నాం. ఇందుకు మీడియా పోకడలతో పాటు వైసీపీ వ్యూహ రాహిత్యం కూడా కారణమేనని నేనన్నాను. ఈ వారం జగన్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని పాదయాత్రపై ఫోకస్‌ పెంచాలని వైసీపీ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. సాక్షి ఎలాగూ ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తుంది. యాత్రపై మాలాటి వారి వ్యాఖ్యానాలు స్పందనలు తీసుకుంటున్నారు కూడా. ఇవన్నీ రాజకీయంగానే ప్రసారం చేయొచ్చు. ఇదే కారణంతో కావచ్చు సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ మీడియా గోష్టి నిర్వహించారు. జగన్‌ పాదయాత్ర విశేషాలు పంచుకున్నారు. అదే సమయంలో ఒక మూడక్షరాల మంత్రం ఆయన ప్రయోగించారు. గతంలో వైఎస్‌ఆర్‌ అనే మూడక్షరాలు(ఇంగ్లీషులో) ప్రజలకు ఎక్కడ లేని భరోసా ఇచ్చేవట.ఇప్పుడు కూడా అవే మూడక్షరాలు(కాకుంటే తెలుగులో) జగన్‌ వారికి భరోసాగా వున్నారన్నారు. జగన్‌పైన గోబెల్స్‌ తరహా దుష్ప్రచారం సాగుతున్నదని ఆరోపించిన బొత్స తమకు యువ నాయకత్వముందని పదేపదే చెప్పడం గమనించదగ్గది. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్ది వైఎస్‌ వారసత్వం జగన్‌ యువనాయకత్వంపై వైసీపీ ఎక్కువ ప్రచారం చేయనున్నది. విశాఖ జిల్లా పెందుర్తిలో దళితస్త్రీపైన కుటుంబంపైన టిడిపినేతల దౌర్జన్యాలను కూడా ఈ సందర్భంగా బొత్స, మరోవైపున రోజాతీవ్రంగా ఖండించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close