బాల‌య్య స్ట్రిక్ట్ రూల్స్‌

ఎన్టీఆర్ బ‌యోపిక్ హ‌డావుడిలో ఉన్నాడు నంద‌మూరి బాల‌కృష్ణ. జై సింహా విడుద‌ల అయ్యాక‌… పూర్తి స్థాయిలో ఆ సినిమాపై దృష్టి పెట్ట‌బోతున్నారు. మార్చి నుంచి షూటింగ్ మొద‌లు కాబోతోంది. ఈలోగా టీజ‌ర్ కోసం కొన్ని షాట్స్ తెర‌కెక్కించారు. ఈనెల 18న హైద‌రాబాద్‌లో టీజ‌ర్ విడుద‌ల చేస్తారు. అందుకు త‌గిన వేదిక కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది. టీజ‌ర్ షూటింగ్‌ని రామ‌కృష్ణ స్డూడియోస్‌లో జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. సెట్లో… ద‌ర్శ‌కుడు, కెమెరామెన్‌, బాల‌య్య త‌ప్ప ఎవ‌రూ లేర‌ట‌. నాలుగో వ్య‌క్తి ఉండ‌కూడ‌దు అని స్ట్రిక్ రూల్స్ పెట్టాడ‌ట బాల‌య్య‌. ఆఖ‌రికి సెల్‌ఫోన్ల‌నీ తీసుకురానివ్వ‌లేద‌ని.. అంత ప‌క‌డ్బందీగా షూటింగ్ సాగింద‌ని తెలుస్తోంది. రెగ్యుల‌ర్ షూటింగ్ స‌మ‌యంలోనూ ఇంతే ప్రణాళికా బ‌ద్దంగా వ్య‌వ‌హిరించాల‌ని భావిస్తున్నాడు బాల‌య్య‌. సెట్లో ఏం జ‌రుగుతుంది? ఎలాంటి స‌న్నివేశాలు తీస్తున్నారన్న విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌కుండా బాల‌య్య జాగ్ర‌త్త‌లు తీసుకోబోతున్నాడ‌ట‌. ఈ విష‌య‌మై త‌న టీమ్‌కి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం టీజ‌ర్ క‌ట్ చేసే ప‌నిలో ఉన్నాడు తేజ‌. ఈ టీజ‌ర్‌లో ఎన్టీఆర్ గెట‌ప్పులో ఉన్న బాల‌య్య‌ని చూపించ‌ర‌ట‌. అన్నీ బ్యాక్ షాట్సే ఉంటాయ‌ని, కాక‌పోతే… ఓ మూడ్ క్రియేట్ చేయ‌డానికి ఈ టీజ‌ర్ దోహ‌ద‌ప‌డ‌బోతోంద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close