బాధతో సరిపెట్టిన బాబు

అభివృద్ధి వేగంలో ఆంధ్ర ప్రదేశ్‌తో తెలంగాణకు పోలికే లేదని ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేసిన వ్యాఖ్య తనకు బాధ కలిగించినట్టు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో కెసిఆర్‌ మాటలపై చంద్రబాబు స్సందించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు. ఇది కూడా విమర్శగానో వివాదంగానో గాక బాధతో సరిపెట్టడం విశేషం. నిన్న చెప్పుకున్న ఇండియా టుడే కాంక్లేవ్‌లో కెసిఆర్‌ మాటలలో కొంత నమ్రత లోపించిన మాట నిజమే. తెలంగాణ అభివృద్ది గురించిన అతిశయోక్తులు ఎంత అనేది ఒకటైతే అదంతా ఈ మూడున్నరేళ్లలోనే జరగలేదని అందరికీ తెలుసు. హైదరాబాదును నేనే అభివృద్ధి చేశాననే చంద్రబాబ మాటల్లో కొంత ఆత్మస్తుతి వున్నా కొంత నిజం కూడా వుంది గనకే కెటిఆర్‌ కూడా ఒప్పుకున్నారు. కాని నిజాం కాలంలో జరిగిన దాన్ని ఒప్పుకునే టిఆర్‌ఎస్‌ అధినేత టిడిపి హయాంలో జరిగిన భాగాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేరు. పైగా ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు నాశనమై పోయిందనే పాట కూడా వినిపిస్తుంటుంది.ఈ నేపథ్యంలో కెసిఆర్‌ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందన వూహించదగిందే. అందరూ అభివృద్ధి చేశారని 1995 తర్వాత అంటే తన పాలన మొదలైనాక పరిస్థితికీ అంతకుముందుకు మధ్య ఏది ఎలా వుండో పరిశీలిస్తే అంతా అర్థమైపోతుందని ఆయన అన్నారు. మరోవైపున విభజనప్రక్రియల్లో అన్యాయాలు వగైరా గురించి మళ్లీ చెప్పారు. హైదరాబాద్‌ కారణంగా ఆదాయంలో వ్యత్యాసాలున్నాయని అందిరకీ తెలుసు. అయినా ఎపితో పోల్చడమే తప్పయినట్టు కెసిఆర్‌ అనడం గాని దాంతోనే మళ్లీ పాత గాయాలు కెలుక్కోవడం గాని అనవసరం. కాకుంటే ఎన్నికలు దగ్గరయ్యే కొద్ది ఇరు రాష్ట్రాల నేతలూ ప్రాంతీయ కోణాలు మళ్లీ ముందుకు తేవడం మాత్రం అనివార్యం. ఇరువైపులా ప్రజలు వాటిని ఓడించేందుకు సిద్ధంగా వుండాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close