టీమిండియా ఓటమికి కారణం ఇదే… !?

అమెరికాలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. అలాగే, భారత క్రికెట్ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు. స్థిరత్వం లేని జట్లలో మనోళ్లదే నెంబర్ వన్. ఆస్ట్రేలియా సిరీస్ లో వరుసగా మూడు వన్డేల్లో ఓడిపోయి మన జట్టు హ్యాట్రిక్ సాధించింది.

ఆటలో గెలుపు ఉంటుంది. ఓటమి ఉంటుంది. ఇద్దరు ఆడితే ఒక్కరే గెలుస్తారు. నిజమే. కానీ ఎలా ఓడిపోయామన్నది ముఖ్యం. పోరాడి ఓడితే విజేతతో సమానంగా గౌరవం దక్కుతుంది. ఆసీస్ సిరీస్ లో ఎవరెవరు సెంచరీ చేశారు, ఎవరెన్ని వికెట్లు తీశారనేది పక్కన పెడితే, ఒట జట్టుగా ఆత్మ విశ్వాసంతో ఆడక పోవడం, గెలవాలనే కాంక్ష లేకపోవడం వల్లే వరసగా ఓడిపోయారు. పరాయి దేశం కాబట్టి ఓడిపోయామనేది సాకు మాత్రమే. ఇతర దేశాల్లో ఆడి సిరీస్ లు గెలిచిన జట్లు చాలా ఉన్నాయి. ఒకప్పుడు భారత్ కు కూడా ఇలాంటి రికార్డులున్నాయి.

ఆదివారం నాటి మ్యాచ్ లో భారత్ 6 వికెట్లకు 295 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకుంది. సిరీస్ ను గెల్చుకుంది. భారత జట్టులో తరచూ లోపించేది ఒకటుంది. అది, దేశం కోసం ఆడుతున్నాం కాబట్టి గెలుపు లక్ష్యం కావాలనే తపన లేకపోవడం. ఆడినా, ఓడినా కోట్ల రూపాయల డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతోంది. బోర్డు పెద్ద దీవెనలుంటే కొన్నేళ్లపాటు జట్టులో స్థానానికి డోకా లేదు. కాబట్టే కొందరు స్టార్ ప్లేయర్స్ ఇష్టారాజ్యంగా ఆడుతున్నారని క్రికెట్ అభిమానులు బాధ పడుతుంటారు. వాళ్లను చూసి కొత్త వాళ్లలో కూడా గెలవాలనే కసి తగ్గిపోతోంది.

గెలుపు రెండు సార్లు లభిస్తుంది. మొదట మైండ్ లో. తర్వాత గ్రౌండ్ లో. గెలవాలని అనుకునే వారు, గెలుస్తామని తమను తాము నమ్మేవాళ్లు కచ్చితంగా గెలుస్తారు. లేదా హోరాహోరీగా పోరాడి ఓడిపోతారు. మన జట్టులోని కొందరు ఆటగాళ్లలో జోష్, తెగింపు, పట్టుదల, విజయ కాంక్ష ఉన్నట్టు కనిపించదు. కొద్ది మంది మాత్రమే ప్రాణాలకు తెగించి అయినా సరే గెలవాలనే పట్టుదలతో ఆడుతారు. కానీ ఏం లాభం?క్రికెట్ అనేది టీమ్ గేమ్. అందరూ సమన్వయంతో, కసిగా ఆడితేనే కదా గెలిచేది. మొత్తానికి ఆస్ట్రేలియా సిరీస్ లో ఆడిన అన్ని మ్యాచ్ లను ఓడిపోవడం అనే రికార్డును మనోళ్లు సృష్టిస్తారా? ఇక ముందైనా నిజంగా దేశం కోసం ఆడి గెలుస్తారా? చూద్దాం

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close