ఆ విషయంలో చిరంజీవిని ఫాలో అవుతున్న బాలకృష్ణ!

నందమూరి బాలకృష్ణ 99వ సినిమా ‘డిక్టేటర్‌’ మాస్‌ ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్‌ చేస్తూ కలెక్షన్లు సాధిస్తున్న విషయం తెలిసిందే. ‘లయన్‌’ నందమూరి అభిమానుల్ని డిజప్పాయింట్‌ చేసినా ‘డిక్టేటర్‌’ అభిమానులతోపాటు బాలకృష్ణకు కూడా కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పుడు తన 100వ సినిమా ఎలా వుండాలి, ఎవరితో చెయ్యాలి అనే విషయంలో బాలకృష్ణ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. నిన్న మొన్నటి వరకు చిరంజీవి తన 150వ సినిమా ఏ డైరెక్టర్‌తో చెయ్యాలి, కథ ఎలా వుండాలి అనే విషయాల్లో చాలా కన్‌ఫ్యూజ్‌ అవ్వడమే కాకుండా ఇప్పటికి వరకూ ఏదీ తేల్చలేదు. ఇప్పుడు బాలకృష్ణ వంతు వచ్చింది. చిరంజీవిలాగే ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నాడు బాలయ్య. తనకు సింహా, లెజెండ్‌ వంటి బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చిన బోయపాటి శ్రీనుతోనే 100వ సినిమా చేస్తానని మొన్నటి వరకు చెప్పిన బాలయ్య ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా సింగీతం శ్రీనివాసరావుతో ‘ఆదిత్య 999’ చేసే ఆలోచనలో వున్నట్టు తెలిసింది.

100వ సినిమా అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రంగా భావించిన బాలకృష్ణ ఈ సినిమాని కొత్త డైరెక్టర్‌తో చేస్తే ఎలా వుంటుంది అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాడట. పరుచూరి వెంకటేశ్వరరావు తనయుడు పరుచూరి రవీంద్ర తన ఫస్ట్‌ మూవీ బాలకృష్ణతో చెయ్యాలని ఉవ్విళ్ళూరుతున్నాడట. ఇప్పటికే రవీంద్ర ఒక జానపద కథను బాలకృష్ణకు వినిపించాడు. భారీ బడ్జెట్‌తో, భారీ గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాల్సి వుంటుంది. మరి 100వ సినిమాని జానపద సినిమాగా బాలయ్య చేస్తాడా? లేదా? అనేది తెలియాల్సి వుంది. బాలకృష్ణ ఏం చెబుతాడా? అని రవీంద్ర ఎదురుచూస్తున్నాడు. మరి బాలకృష్ణ 100వ సినిమా ఎవరి డైరెక్షన్‌లో వుంటుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close