దత్తన్న తొందరపడి లేఖ వ్రాసారా?

కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకి వ్రాసిన లేఖ కారణంగా జరిగిన పరిణామాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ మరణానికి దారి తీసాయని స్పష్టం అవుతోంది. ఈ సమస్యకి మూల కారణం రోహిత్ ప్రాతినిద్యం వహిస్తున్న అంబేద్కర్ విద్యార్ధి సంఘానికి చెందిన కొందరు విద్యార్ధులు ముంబై బాంబు ప్రేలుళ్ళ సూత్రధారి యాకుబ్ మీమన్ ఉరిని వ్యతిరేకించారని, అప్పుడు వారికీ, బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న ఏబివిపి విద్యార్ధి సంఘానికి చెందిన విద్యార్ధులకి మధ్య ఘర్షణ అని దత్తాత్రేయ లేఖని చూస్తే అర్ధమవుతోంది. కానీ అది నిజమో కాదో ఆ విద్యార్ధులకి తప్ప మరెవరికీ తెలియదు. అయితే అంబేద్కర్ విద్యార్ధి సంఘంలో విద్యార్ధులు ఎవరూ యాకుబ్ మెమన్ ఉరిని వ్యతిరేఖించడానికి బలమయిన కారణాలు ఏవీ కనిపించడం లేదు. వారు వ్యతిరేకించారా లేదా అనేది విచారణలో తేలాలి. యాకుబ్ మీమన్ ఉరిని దేశంలో చాలా మంది వ్యతిరేకించారు. కనుక ఒకవేళ అంబేద్కర్ సంఘం విద్యార్ధులు కూడా ఏ కారణం చేతయినా దానిని వ్యతిరేకించి ఉండి ఉంటే అదేమీ పెద్ద నేరం కాదు. కనుక ఆ కారణంతో వారిపై చర్యలు తీసుకోమని బండారు దత్తాత్రేయ లేఖ వ్రాసి ఉంటే అది తొందరపాటే అని భావించాల్సి ఉంటుంది.

ఇటీవల ఉస్మానియాలో ‘బీఫ్ ఫెస్టివల్’ పై రెండు విద్యార్ధి సంఘాల మధ్య గొడవ జరిగినట్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా జరిగి ఉండే అవకాశం ఉంది. కానీ ఆ యూనివర్సిటీ అటువంటివేవీ జరిగినట్లు మీడియాలో వార్తలు రాలేదు. అంటే వేరే ఇతర కారణాల చేత, బహుశః కులాల కారణంగానే వారి మధ్య ఘర్షణ జరిగి ఉండవచ్చును. అదే నిజమయితే, ఏబివిపి విద్యార్దుల పిర్యాదులను నమ్మి బండారు దత్తాత్రేయ తొందరపడి కేంద్రానికి లేఖ వ్రాసినట్లు భావించవలసి ఉంటుంది. అప్పుడు ఆ లేఖపై మానవ వనరుల అభివృద్ధి శాఖ కూడా అతిగానే స్పందించినట్లుగానే భావించక తప్పదు. కేంద్రం నుండి ఒత్తిడి వస్తునప్పుడు యూనివర్సిటీ చేతులు ముడుచుకొని కూర్చోలేదు కనుక ఐదుగురు విద్యార్ధులను సస్పెండ్ చేసి ఉండవచ్చును.

ఇప్పుడు కమిటీలు వేసుకొని విచరణ చేసి తాపీగా వాస్తవాలు కనుగొన్నప్పటికీ చనిపోయిన రోహిత్ ని తిరిగి బ్రతికించుకోలేము. కనుక ఇకనయినా విద్యార్ధుల గొడవలలో రాజకీయ నేతలు వేలు పెట్టకుండా ఉంటే మంచిది. అలాగే విద్యార్ధులు కూడా ఈ కులం, మతం, ప్రాంతం, బాష వంటి సంకుచిత భావాలలో పది కొట్టుకుపోతూ సాటి విద్యార్ధులతో ఘర్షణ పడటం సరికాదు. భారతదేశ భవిష్యత్ తమపైనే ఆధారపడి ఉందనే సంగతి సదా గుర్తుంచుకొని, అందుకు అనుగుణంగా దేశం గర్వించే విధంగా పైకి ఎదగాలి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్ధులను పావులుగా వాడుకొంటాయనే సంగతి రోహిత్ మరణంపై అవి చేస్తున్న హడావుడితో ప్రత్యక్షంగా కనబడుతోంది. రాజకీయ నాయకులు ఆడుకొనే ఇటువంటి వికృత రాజకీయ క్రీడలో విద్యార్ధులే తరచూ బలవుతున్నరనే సంగతి వారు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. కనుక విద్యార్ధులు రాజకీయ పార్టీలకి, నేతలకీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close