వైకాపా ఎంపీల రాజీనామాల ప‌రిస్థితేంటి..?

హోదా సాధ‌న దిశ‌గా సాగించిన అలుపెరుగ‌ని పోరాటంలో ఆఖ‌రి అస్త్రంగా వైకాపా ఎంపీలు రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత‌, నిరాహార దీక్ష‌ల‌కు దిగారు. ఇప్ప‌టికే ముగ్గురు ఎంపీలను అస్వ‌స్థ‌త కార‌ణంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మిగ‌తా ఇద్ద‌రు మాత్ర‌మే దీక్ష చేస్తున్నారు. అయితే, ఆసుప‌త్రి నుంచి వారు తిరిగి దీక్షా శిబిరానికి వ‌స్తారా లేదా అనేదానిపై ఇంకా స్ప‌ష్ట‌త లేదు. ఇక‌, వైకాపా ఎంపీల రాజీనామాల విష‌యానికొస్తే… ఐదుగురు ఎంపీలూ స్పీక‌ర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేసిన‌ప్ప‌టికీ, ఇంకా వాటి ఆమోదం జ‌ర‌గ‌లేదు.

ఈ ఐదుగురు ఎంపీల రాజీనామాలను ఇప్ప‌టికిప్పుడే స్పీక‌ర్ ఆమోదించేసే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. అంతేకాదు, రాజీనామాలు ఆమోదం పొంద‌కుండా చేసుకునేందుకు కూడా వైకాపాకు అనువైన వాతావ‌ర‌ణం కేంద్రం ద‌గ్గ‌ర ఉంద‌నే విమ‌ర్శ‌లూ వినిపిస్తున్నాయి. నిజానికి, ఎంపీలు రాజీనామాలు చేసిన వెంట‌నే వారిని స్పీక‌ర్ స్వ‌యంగా పిల‌వాలి. ఎందుకు రాజీనామాలు చేశారో తెలుసుకున్నాక‌నే, వారు రాజీనామాలు చేశార‌ని ప్ర‌క‌టించి, ఆమోదిస్తారు. అయితే, ఆ అవ‌కాశం ఇవ్వ‌కుండా రాజీనామా చేసిన వెంట‌నే వైకాపా ఎంపీలు దీక్ష‌కు కూర్చుండిపోయారు. దీంతో స్పీక‌ర్ పిలిచి మాట్లాడే ప‌రిస్థితి లేకుండా పోయింది.

దీంతో ఈ రాజీనామాల‌ను ఎప్పుడు ఆమోదిస్తార‌నే చ‌ర్చ ప‌క్క‌కు వెళ్లింది. ఎలాగూ వారికి ఇప్పుడు భాజ‌పా పెద్ద‌ల అండ బాగా ఉంది కాబ‌ట్టి, రాజీనామాలు ఆమోదం పొంద‌కుండా చూసుకోగ‌ల‌ర‌నే అభిప్రాయ‌మూ వినిపిస్తోంది. పోనీ, క‌నీసం లోక్ స‌భ స్పీక‌రైనా స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించి, రాజీనామాల‌పై స్పందించే అవ‌కాశం ఉందా అంటే.. అదీ లేదు. అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాకుండా, స‌భ ఆర్డ‌ర్ లో లేద‌న్న కార‌ణంతోనే నెట్టుకొచ్చిన తీరును మ‌నం చూశాం.

ఇక‌, రాజ్య‌స‌భ స‌భ్యుల రాజీనామా అంశం ఇప్పుడు నెమ్మ‌దిగా చ‌ర్చ‌నీయం అవుతోంది. పార్ల‌మెంటు స‌భ్యులు అంటే ఉభ‌య స‌భ‌ల‌కూ చెందిన‌వారౌతార‌నీ, కానీ వైకాపా మాత్రం కేవ‌లం లోక్ స‌భ స‌భ్యుల‌తో మాత్ర‌మే రాజీనామాలు చేయించి, రాజ్య‌స‌భ ఎంపీల‌కు అది వ‌ర్తించ‌దు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం ద్వంద్వ వైఖ‌రి అంటూ టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. వైకాపా రాజ్య‌స‌భ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే, వెంట‌నే తానూ రాజీనామా చేస్తానంటూ టీడీపీ నేత జేసీ దివాక‌ర్ రెడ్డి స‌వాల్ చేశారు. అయితే, వీటిపై వైకాపా నేత‌లు స్పందించ‌దు క‌దా! ఎందుకంటే, ముఖ్యంగా విజ‌య‌సాయి రెడ్డితో రాజీనామా చేయించ‌డం వారికి సాధ్యం కాని ప‌ని క‌దా! ఆయ‌న ఢిల్లీలో ఉండాలి, కేంద్రంతో ట‌చ్ లో ఉండాలి క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close